
చిన్నారులను అంగన్వాడీల్లో చేర్పించాలి
డిచ్పల్లి: మూడు సంవత్సరాల వయసు రాగానే పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని సీడీపీవో రామగిరి జ్యోతి పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని డిచ్పల్లి ఖిల్లా గ్రామంలో మంగళవారం అమ్మ మాట– అంగన్వాడీ బాట కార్యక్రమంలో భాగంగా ప్రయివేటు వద్దు.. అంగన్వాడీ ముద్దు అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. చిన్నారులు ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని, వారికి ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలపై తల్లితండ్రులకు అవగాహన కల్పించారు. అంగన్వాడీ కేంద్రాలను అందంగా అలంకరించి కొత్తగా చేరిన పిల్లల సెల్ఫీ పాయింట్ (మై ఫస్ట్ డే)లో ఫొటోలు తీశారు. ఫ్రీ స్కూల్ కిట్, పిల్లల ఆటవస్తువుల గురించి తల్లులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్లు శోభ, బుజ్జి, ప్రైమరీ స్కూల్ హెచ్ఎం సాయిలు, హెల్త్ సూపర్వైజర్లు దేవపాలం, ఏఎన్ఎంలు దేవీమేరి, శోభాకుమారి, అంగన్వాడీ టీచర్లు అనిత, స్వప్న, సురేఖ, శుభం రాణి, స్రవంతి, రాజమణి, ఆశావర్కర్లు వేదవతి, శోభ, లలిత, పుష్ప తదితరులు పాల్గొన్నారు.