
సఖీ సెంటర్ తనిఖీ..
నిజామాబాద్నాగారం: నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆవరణలో గల సఖీ సెంటర్ను సీపీ సాయి చైతన్య మంగళవారం సాయంత్రం తనిఖీ చేశారు. ఆశ్రయం పొందుతున్న గృహహింస, చీటింగ్ కేసు బాధిత మహిళలతో కమిషనర్ మాట్లాడారు. సఖీ సెంటర్కు వచ్చే కాల్స్, ఫాలోఅప్ చేసే విధానం, మెయింటెనెన్స్ బాగుందని ప్రశంసించారు. బాధిత మహిళలకు అన్ని ర కాల సేవలు సకాలంలో అందించాలన్నారు. సఖీ సెంటర్, భరోసా, ఐసీపీఎస్ ఒకే దగ్గర ఉంటే బా గుంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమా ధికారి షేక్ రసూల్ బీ, ఉమెన్ కమిషన్ సభ్యులు సుదం లక్ష్మి, స్నేహ సొసైటీ అండ్ సఖీ సెక్రెటరీ సిద్దయ్య, సఖీ సెంటర్ అధికారి భానుప్రియ, డీసీపీవో చైతన్య, సఖీ సిబ్బంది పాల్గొన్నారు.