
రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం : కలెక్టర్
నిజామాబాద్అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం (పెట్టుబడి సాయం) నిధులు వా నాకాలం 2025 సీజన్కు సంబంధించి జిల్లా లో 2,98,472 మంది రైతుల ఖాతాల్లో రూ. 326.03 కోట్లు జమ చేస్తున్నట్లు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 2,12,172 మంది రైతుల ఖాతాలలో రూ. 160.72 కోట్లు జమ అయ్యాయన్నారు. ఈ నెల 16న రెండెకరాల లోపు భూమి కలిగిన 1,68,166 మంది రైతుల ఖాతాలలో ఎకరాకు రూ. ఆరు వేల చొప్పున రూ. 95.66 కోట్లు జమ అయ్యాయన్నారు. మంగళవా రం మూడెకరాల వరకు భూమి ఉన్న 44,006 మంది రైతుల ఖాతాలలో రూ. 65.06 కోట్లు జమ అయినట్లు కలెక్టర్ వివరించారు. మిగతా రైతులకు కూడా పెట్టుబ డి సాయం వారి ఖాతాలలో జమచేయనున్నట్లు తెలిపారు. పెట్టుబడి భారం తగ్గించి, వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించేందుకు రైతు భరోసా పథకం ఉపయుక్తంగా నిలుస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు.
నేడు ధ్రువపత్రాల
పరిశీలన
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో 2025–26 విద్యాసంవత్సరానికి దోస్త్ ఆన్లైన్ డిగ్రీ ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రత్యేక కేటగిరి విద్యార్థులకు బుధవారం ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తామని అడ్మిషన్స్ డైరక్టర్, దోస్త్ కోఆర్డినేటర్ వాసం చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రత్యేక కేటగిరి పీహెచ్సీ (దివ్యాంగులు), సీఏపీ, ఎన్సీసీ, స్పోర్ట్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ అక్టివిటీస్ సంబంధించి విద్యార్థులు తెయూ అడ్మిషన్స్ కార్యాలయంలో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాలని ఆయన తెలిపారు.
నిలకడగా ఎస్సారెస్పీ నీటిమట్టం
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే నీరు, కాలువల నుంచి వెళ్లే నీరు సమానంగా ఉండటంతో నీటిమట్టం నిలకడగా ఉంది. ప్రాజెక్ట్లోకి 599 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. కాకతీయ కాలువ ద్వారా 100 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 268 క్యూసెక్కుల నీరు పోతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా మంగళవారం సాయంత్రానికి ప్రాజెక్ట్లో 1063.20(13.83 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు.