కొత్త కోర్సులు.. భవిష్యత్తుకు సోపానాలు | - | Sakshi
Sakshi News home page

కొత్త కోర్సులు.. భవిష్యత్తుకు సోపానాలు

Jun 18 2025 7:20 AM | Updated on Jun 18 2025 7:20 AM

కొత్త

కొత్త కోర్సులు.. భవిష్యత్తుకు సోపానాలు

నిజామాబాద్‌ అర్బన్‌: ఐటీఐలను ప్రభుత్వం మరింత బలోపేతం చేసింది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉపాధి అవకాశాలు లభించేలా తీర్చిదిద్దుతూ నూతన కోర్సులను అందుబాటులోకి తీసుకువచ్చింది. అందులో భాగంగా పలు ఐటీఐలను ఏటీసీ(అడ్వాన్స్‌డ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌)లుగా మార్చింది. విద్యార్థుల్లో నైపుణ్యం పెంచి మంచి వేతనంతో ఉద్యోగాలు కల్పించనున్నాయి.

ఐటీఐలలో 1,516 సీట్లు

ఐటీఐ పూర్తిచేసిన వారికి త్వరగా ఉపాధి లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పదో తరగతి పూర్తి చేసిన వారు ఐటీఐ కోర్సులో చేరేందుకు అర్హులు. జిల్లాలో ఎనిమిది ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలు ఉండగా, అందులో 1,516 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఏడాది కోర్సులుగా కంప్యూటర్‌ వెల్డర్‌, డీజిల్‌ మెకానిక్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ ప్రోగ్రామింగ్‌ అనలిస్ట్‌, రెండేళ్ల కోర్సులుగా డ్రాఫ్ట్‌మెన్‌(సివిల్‌), డ్రాఫ్ట్‌మెన్‌(మెకానికల్‌), ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌, మోటార్‌ మెకానిక్‌, మిషనిస్ట్‌ టర్నర్‌, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్‌ వంటి వాటిపై శిక్షణ ఇస్తున్నారు.

21లోపు దరఖాస్తు చేసుకోవాలి

ఐటీఐ, ఏటీసీలలో ప్రవేశాలకు ప్రస్తుతం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 21లోపు విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఐటీఐలో చేరే విద్యార్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కోర్సు ప్రతిపాదికన వెబ్‌ ఆప్షన్లు పెట్టి ధ్రువపత్రాలను స్కాన్‌ చేసి అప్‌లోడ్‌ చేయాలి. మెరిట్‌, రోల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌, వెబ్‌ ఆప్షన్ల ప్రకారం సీట్ల కేటాయింపు జరుగుతుంది.

ప్రతిభ కనబరిస్తే ఉద్యోగం సులభమే

అందుబాటులోకి ఏటీసీలు

ఐటీఐలో ఆధునిక కోర్సులు

మంచి అవకాశం..

పదో తరగతి విద్యార్థులకు ఇ ది మంచి అవకాశం. అనేక కోర్సులు అందుబాటులో ఉ న్నాయి. ఉపాధి త్వరగా లభి స్తుంది. ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయి. ఐటీఐలో విద్యార్థులు తమకు నచ్చిన కోర్సులు ఎంపిక చేసుకోవచ్చు. రెండేళ్లు కోర్సు పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

– యాదగిరి, జిల్లా కన్వీనర్‌, ఐటీఐ ప్రిన్సిపల్‌

ఏటీసీల్లో ఆరు కోర్సులు

జిల్లాలోని నిజామాబాద్‌, కమ్మర్‌పల్లి, బోధన్‌ ఐటీఐలను ప్రభుత్వం ఏటీసీలుగా తీర్చిదిద్దింది. ఒక్కో ఏటీసీలో 172 సీట్ల చొప్పున మొత్తం 516 సీట్లను అందుబాటులోకి తెచ్చింది. ఏటీసీల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం టాటా టెక్నాలజీస్‌ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు వెంటనే అప్రెంటిస్‌షిప్‌ కల్పిస్తారు. అదేవిధంగా ఇతర కార్పొరేట్‌ కంపెనీల్లో ఉద్యోగాలు లభించే అవకాశం మెండుగా ఉన్నాయి. ఏటీసీల్లో ప్రధానంగా ఆరు కోర్సులను ప్రవేశపెట్టారు. ఏడాది కోర్సులుగా ఆర్టీసియన్‌ యూజింగ్‌ అడ్వాన్స్‌డ్‌ టూల్‌, ఇండస్ట్రియల్‌ రోబోటిక్స్‌ అండ్‌ డిజిటల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌, మాన్యుఫ్యాక్చరింగ్‌ ప్రాసెస్‌ కంట్రోల్‌ ఆటోమెషన్‌, రెండేళ్ల కోర్సులుగా బేసిక్‌ డిజైనర్‌ అండ్‌ వెరిఫైర్‌, అడ్వాన్స్‌డ్‌ సీఎన్‌సీ మిషనింగ్‌ టెక్నీషియన్‌, మెకానిక్‌ ఎల క్ట్రికల్‌ వెహికిల్‌ అందుబాటులో ఉన్నాయి.

కొత్త కోర్సులు.. భవిష్యత్తుకు సోపానాలు 1
1/1

కొత్త కోర్సులు.. భవిష్యత్తుకు సోపానాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement