
సైబర్ నేరాలు, గేమింగ్ యాప్లపై దృష్టి సారించాలి
రెంజల్(బోధన్): సైబర్ నేరాలు, గేమింగ్ యాప్ల పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీపీ సాయి చైతన్య సూ చించారు. యువత చెడు వ్యసనాలకు బానిస కా కుండా గ్రామాల్లో కౌన్సెలింగ్ నిర్వహించాలని పే ర్కొన్నారు. మంగళవారం రెంజల్లోని పోలీస్స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏ విధంగా ఫిర్యా దులు తీసుకుంటున్నారు, కేసుల నమోదు ఎలా చేస్తున్నారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ సిబ్బందితో పాటు ఫిర్యాదు దారుల వాహన పార్కింగ్ను పరిశీలించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకునాల్సిన జాగ్రత్తలను వివరించారు. ప్రధానంగా రోడ్డు ప్రమాదాలు ద్విచక్ర వాహనదారులకు జరుగుతున్నాయని, నిత్య వాహనాల తని ఖీ నిర్వహించి వాహనదారులకు హెల్మెట్ వినియోగం పై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. గంజాయి నిర్మూలనకు తీసుకునాల్సిన జాగ్రత్తలను పోలీసులకు వివరించారు. యువత గంజాయి బారిన పడకుండా పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సైబర్ నేరగాళ్లతో పాటు గేమింగ్ యాప్ల వలలో చిక్కకుండా అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రూరల్ సీఐ విజయ్బాబు, ఎస్సై చంద్రమోహన్లు ఉన్నారు.