శతాధిక వృద్ధురాలు మృతి | - | Sakshi
Sakshi News home page

శతాధిక వృద్ధురాలు మృతి

Jun 18 2025 3:13 AM | Updated on Jun 18 2025 3:13 AM

శతాధి

శతాధిక వృద్ధురాలు మృతి

ఎల్లారెడ్డిరూరల్‌: ఎల్లారెడ్డి మండలంలోని దావల్‌మల్కపల్లి గ్రామంలో మంగళవారం శతాధిక వృద్ధురాలు మరణించినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామంలోని పట్టెం వెంకవ్వ (102) అనారోగ్యంతో మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఆమె అంత్యక్రియలకు దాక్షాయని స్వచ్ఛంద సంస్థ రూ.5 వేలు ఆర్థిక సహాయం అందించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

కారు, బైకు ఢీకొని ఒకరు..

ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి పట్టణ శివారులో మంగళవారం కారు, బైకు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఎల్లారెడ్డి నుంచి హసన్‌పల్లికి బైకుపై వెళ్తున్న అంజయ్యను బాన్సువాడ వైపు నుంచి కామారెడ్డి వైపునకు వెళ్తున్న కారు ఢీకొనడంతో తీవ్రగాయమైనట్లు పేర్కొన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అంజయ్యను ఆటోలో ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ తరలిస్తుండగా అంజయ్య మృతి చెందినట్లు తెలిపారు.

శతాధిక వృద్ధురాలు మృతి1
1/1

శతాధిక వృద్ధురాలు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement