
త్రినేత్ర శివలింగం.. ఉమామహేశ్వర ఆలయం
మీకు తెలుసా?
నందిపేట మండలం ఉమ్మెడ శివారులో గల గోదావరి నది పరీవాహక ప్రాంతంలో ఉన్న ఉమామహేశ్వర ఆలయం ఎంతో విశిష్టత కలిగి ఉంది.
● త్రేతాయుగంలో శ్రీరాముడు నడిచిన బాటలో గోదావరి నది ఒడ్డున ఇసుతో సైకత లింగాన్ని చేసి శివరూపాన్ని భక్తితో పూజించినట్లు పురాణాలు చెబుతున్నాయి.
● ఈ శివలింగం ప్రత్యేకతను తెలుసుకొని సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం 10, 11 వ శతాబ్దపు మధ్యకాలంలో కల్యాణ చాళుక్యుల మహారాజైన మహా మండళేశ్వరుడు కట్టించిన దేవాలయమని అని చరిత్ర ద్వారా తెలుస్తుంది.
● ఈ ఆలయంలో శివలింగం మీద త్రినేత్రం కనిపించడం విశేషం.
● దీపగండంగా పిలువబడే 108 దీపాల ధ్వజస్తంభం ప్రత్యేకత.
● పోదశ స్తంభాలతో మండపం. ప్రతి స్తంభం మీద నాగ శాసనాలు, దేవాలయం చుట్టూ దాన శాసనాలు(ప్రతేక లిపితో రాసినవి) కలిగి ఉంటాయి.
● ప్రతి సంవత్సరం వర్షాకాలంలో గోదావరి బ్యాక్ వాటర్లో నీటమునిగే దేవాలయం, శివరాత్రి సమయంలో బయట పడుతుంది. మూ డురోజులపాటు ఉత్సవాలను నిర్వహిస్తారు.
● నందిపేట మండల కేంద్రానికి 8 కిలో మీటర్ల దూరంలో గోదావరి పరీవాహక ప్రాంతంలో నది ఒడ్డున ఉండడంతో ఈ ఆలయం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.
– నందిపేట్