డిచ్పల్లి: గిరిజనుల సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం ఈ నెల 15 నుంచి 30 వరకు జన జాతీయ గౌరవ్ వర్ష్ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న పీఎం జన్మన్ (ప్రధాన మంత్రి ఆదివాసీ న్యాయ మహా అభియాన్) కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ట్రైబల్ డెవలప్మెంట్ ఆఫీసర్ నాగోరావు సూచించారు. డిచ్పల్లి మండలం బీబీపూర్, బీబీపూర్ తండా గ్రామాల్లో మంగళవారం నిర్వహించిన పీఎం జన్మన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని గిరిజనులకు అవగాహన కల్పించారు. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాలు, 63 వేల గ్రామాలు, 5.5కోట్ల గిరిజన జనాభా అభివృద్ధి, సంక్షేమం కోసం రూ.80 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డిచ్పల్లి ఎంపీడీవో బుక్య లింగం నాయక్, గ్రామ ప్రత్యేకాధికారి డాక్టర్ గోపీకృష్ణ, ఎఫ్బీవో రాకేశ్, ట్రైబల్ వాలంటీర్ సంతోష్, పంచాయతీ కార్యదర్శి గౌతమి, ఉపాధ్యాయుడు రాజు, అంగన్వాడీ టీచర్ సక్కుబాయి, ఆశ వర్కర్ ప్రియాంక, వీవో దివ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.