
జీపీ కార్మికులకు అందని వేతనాలు
నందిపేట్(ఆర్మూర్): మండలంలోని అన్ని గ్రామాలను పరిశుభ్రంగా ఉంచే పంచాయతీ కార్మికులకు మూడు నెలలుగా వేతనాలు అందడంలేదు. మండలంలో మొత్తం 20 గ్రామపంచాయతీలు ఉన్నాయి. జనాభా ప్రాతిపదికన గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టడం కోసం ప్రభుత్వం ఆయా జీపీల పరిధిలో మల్టీపర్పస్ వర్కర్ల పేరున 110 మంది పంచాయతీ కార్మికులను నియమించింది. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంతో విశేష కృషి చేస్తున్న కార్మికులకు గత మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబందించి వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలే అరకొర వేతనాలు అవికూడ నెలనెలా రాకపోవడంతో ఇబ్బందిగా ఉందని వాపోతున్నారు. ఇప్పటికై న అధికారులు వెంటనే స్పందించి వేతనాలు విడుదల చేయాలని పంచాయతీ కార్మికులు కోరుతున్నారు.
నందిపేటలో 110 మంది..
ఆర్థిక ఇబ్బందుల్లో కార్మికులు
నిధులు విడుదల చేయాలని వినతి