ఆత్మీయ పలకరింపులు.. మధుర స్మృతులు | - | Sakshi
Sakshi News home page

ఆత్మీయ పలకరింపులు.. మధుర స్మృతులు

Jun 16 2025 7:07 AM | Updated on Jun 16 2025 7:07 AM

ఆత్మీయ పలకరింపులు.. మధుర స్మృతులు

ఆత్మీయ పలకరింపులు.. మధుర స్మృతులు

సాక్షి నెట్‌వర్క్‌: ఆత్మీయ పలకరింపులు.. ఆపాత మధుర స్మృతులను గుర్తుకు తెచ్చుకుని పూర్వ విద్యార్థులు భావోద్వేగానికి లోనయ్యారు. అరే ఎన్నాళ్లయింది కలుసుకుని.. పూర్తిగా మారిపోయావంటూ ఆనాటి స్నేహితులు ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో హర్షం వ్యక్తంచేశారు. ఉమ్మడి జిల్లాలోని వివిధ గ్రామాల ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల పదోతరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ఈసందర్భంగా చిన్నానాటి మిత్రులందరూ ఏళ్ల తర్వాత మళ్లీ ఒకే వేదికపై కలుసుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఒకరినొకరు పలకరించుకుంటూ అనాటి జ్ఞాపకాలను గుర్తుకుతెచ్చుకున్నారు. నాడు చదువు నేర్పిన ఉపాధ్యాయులను సమ్మేళనానికి ఆహ్వానించి, సన్మానించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. అనంతరం విద్యార్థులు, గురువులు అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. అలాగే నగరంలోని ఓ హోటల్‌లో ఉమ్మడి జిల్లాలోని 2000 బ్యాచ్‌కు చెందిన పోలీస్‌ కానిస్టేబుళ్లు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కామారెడ్డిలోని సిద్ధార్థ జూనియర్‌ కళాశాల 1999–2001 బ్యాచ్‌ బైపీసీ విద్యార్థులు పట్టణంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

జిల్లాలో పలుచోట్ల సమ్మేళనాలు

నిర్వహించిన పూర్వవిద్యార్థులు

ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో

భావోద్వేగానికి గురైన

చిన్ననాటి మిత్రులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement