
యోగాతో మానసిక ప్రశాంతత
రుద్రూర్: యోగా ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని, ఆరోగ్య కరమైన జీవన శైలి అలవడుతుందని బోధన్ కోర్టు సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శేషతల్ప సాయి అన్నారు. మండలంలోని అక్బర్నగర్లోగల సంస్కార్ ప్రకృతి చికిత్సాలయంలో ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం యోగాపై అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన హాజరై సాధకులతో కలిసి యోగాసనాలు వేశారు. అనంతరం మాట్లాడుతూ.. యోగా ద్వారా దైనందిన జీవితంలో వచ్చే ఒత్తిడిని తగ్గించుకోవచ్చునని అన్నారు. యోగా, ప్రాణాయామం, సూర్య నమస్కారాలు శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అభ్యాసమని అన్నారు. వీటిని ఆచరించడం ద్వారా జీవన కాలం పెంపొందించుకోవచ్చునని అన్నారు. యోగా శిక్షణ కార్యక్రమాలను వినియోగించుకోవాలని సూచించారు. సంస్కార్ ప్రకృతి ఆశ్రమం వ్యవస్థాపకులు మార్ని రామ కృష్ణారావ్, యోగా మాస్టర్ సాయిలు, బచ్చు రాము తదితరులు పాల్గొన్నారు.
ఆలయానికి రూ.లక్ష విరాళం
బోధన్రూరల్: పట్టణంలోని ఆచన్పల్లి హనుమాన్ ఆలయానికి ఆదివారం ఫాదర్స్డే సందర్భంగా మహారాష్ట్రలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ హరిబాబు తన తండ్రి జ్ఞాపకార్థం రూ.1,01,606 విరాళం ప్రకటించారు. ఆలయ కమిటీ ప్రతినిధులకు ఆయన విరాళం అందించారు. కార్యక్రమంలో ఆచన్పల్లి పెద్దలు, ఆలయ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఓటు వేసిన రూరల్ ఎమ్మెల్యే
డిచ్పల్లి: నిజామాబాద్లోని ముబారక్నగర్లోగల ఆర్బీవీఆర్ఆర్ పాఠశాల సొసైటీ ఎన్నికలు ఆదివారం జరిగాయి. ఈ సొసైటీ ఎన్నికల పోలింగ్కు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి హాజరై, తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

యోగాతో మానసిక ప్రశాంతత

యోగాతో మానసిక ప్రశాంతత