కొడుకును చంపిన కేసులో తండ్రి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

కొడుకును చంపిన కేసులో తండ్రి అరెస్ట్‌

Jun 16 2025 7:07 AM | Updated on Jun 16 2025 7:07 AM

కొడుక

కొడుకును చంపిన కేసులో తండ్రి అరెస్ట్‌

నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): భార్యపై కోపంతో కొడుకును హతమార్చిన కేసులో తండ్రిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎల్లారెడ్డి సీఐ రవీందర్‌నాయక్‌ తెలిపారు. నాగిరెడ్డిపేట పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామానికి చెందిన అక్షితకు, లింగంపేట మండలం పొల్కంపేట గ్రామానికి చెందిన నర అనిల్‌కు కొన్నేళ్ల కిందట వివాహం జరుగగా, వారికి నాలుగేళ్ల శాశంక్‌ అనే కొడుకు, 7నెలల కూతురు మనుశ్రీ ఉన్నారు. కాగా ఈనెల 10న అనిల్‌ తన భార్య, పిల్లలతో కలిసి మెదక్‌ జిల్లా శాలీపేటలో జరిగిన బోనాల పండుగకు వెళ్లాడు. అక్కడ ఓ గొడవ జరగడంతో అనిల్‌ తన కుటుంబంతో కలిసి పొల్కంపేటకు చేరుకున్నాడు. ఇంటికి వచ్చాక మరోసారి గొడవ జరగగా అనిల్‌ తన భార్యను కొట్టాడు. ఈ నెల 12న అనిల్‌ తన భార్యను పోచారంలో దింపి కొడుకు శశాంక్‌ను బైక్‌పై ఎక్కించుకొని గ్రామశివారులోని పల్లెప్రకృతివనం వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ భార్యపై కోపంతో శశాంక్‌ నోరు, ముక్కు మూసి హత్య చేశాడు. అనంతరం కొడుకును పోచారంలోని తన అత్తగారింటికి తీసుకువచ్చి ఇంట్లో పడుకోబెట్టి వెళ్లిపోయాడు. అచేతనంగా ఉన్న కొడుకును చూసిన అక్షిత అనుమానంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే బాలుడు మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో తన కొడుకును హత్య చేశాడని తల్లి అక్షిత పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మెదక్‌ జిల్లా బూర్గుపల్లి గేట్‌ వద్ద అనిల్‌ను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించగా తానే కొడుకును హత్య చేసినట్లు అంగీకరించాడు. అతడి బైక్‌ను స్వాధీనం చేసుకొని అనిల్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఎస్సై మల్లారెడ్డి, హెడ్‌కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌, కానిస్టేబుల్‌ శ్రీశైలం, హోంగార్డ్‌ కాశయ్యపాల్గొన్నారు.

కొడుకును చంపిన కేసులో తండ్రి అరెస్ట్‌1
1/1

కొడుకును చంపిన కేసులో తండ్రి అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement