డిచ్పల్లి : డిచ్పల్లి రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పాతికేళ్లుగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మింపజేస్తామని హామీ ఇస్తున్న ఎంపీలు మారుతున్నారు కానీ ఇంతవరకు ఏ ఒక్కరూ హామీని నిలబెట్టుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. స్టేషన్కు అవతలి వైపు ప్రభుత్వ ఆస్పత్రి, విద్యా సంస్థలు, కార్యాలయాలు ఉన్నాయి. విద్యార్థులతోపాటు రోగులు, ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల కోసం వివిధ గ్రామాల నుంచి వేలాది మంది నిత్యం రైల్వేస్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటారు. అలాగే ఘన్పూర్, ముల్లంగి గ్రామాలకు వెళ్లే ప్రజలూ ఈ స్టేషన్ నుంచే వెళుతుంటారు. గూడ్స్, ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్ల క్రాసింగ్ సమయంలో విద్యార్థులు, రోగులు, ప్రజలు ప్రమాదకరంగా రైలు బోగీల కింద నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. బోగీల కింద నుంచి దాటుతుండగా రైలు కదిలితే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు స్పందించి ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.
డిచ్పల్లి రైల్వే స్టేషన్లో
ఫుట్ ఓవర్ బ్రిడ్జిలేక ప్రజల ఇక్కట్లు
ఇంకెన్నాళ్లీ అగచాట్లు