
దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి
మోర్తాడ్(బాల్కొండ): మోర్తాడ్కు చెందిన రొ య్యల సురేశ్ అనే యువకుడిపై 40 మంది దా డి చేస్తే కేవలం ఆరుగురిపైనే పోలీసులు కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారని గ్రామ స్తులు ఆరోపించారు. దాడికి పాల్పడిన ప్రతి ఒక్కరినీ అరెస్టు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై సోమవారం బైఠాయించారు. మోర్తాడ్లోని అన్ని కుల సంఘాల సభ్యులు, రాజకీయ పార్టీలకు అతీతంగా గ్రా మం నుంచి జాతీయ రహదారి వరకు ర్యాలీగా చేరుకున్నారు. అనంతరం రాస్తారోకో నిర్వహించి దాడికి పాల్పడిన, వారికి మద్దతు తెలుపుతు న్న వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీ సులు ఉదాసీనంగా వ్యవహరించడంతోనే ఒక వర్గంవారు మోర్తాడ్లో రెచ్చిపోయి హిందువులను లక్ష్యంగా చేసుకొని భౌతికదాడులకు పా ల్పడుతున్నారని ఆరోపించారు. జాతీయ రహ దారిపై బైఠాయించడంతో కరీంనగర్, నిజామాబాద్ రూట్లలో వెళ్లాల్సిన వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. భీమ్గల్ సీఐ సత్య నారాయణ, మోర్తాడ్ ఎస్సై విక్రమ్, ఇతర పోలీ సు అధికారులు ఆందోళనకారులతో చర్చించా రు. నిందితుల కోసం గాలిస్తున్నామని, ఇప్పటి వరకూ తాము గుర్తించిన ఆరుగురిని రిమాండ్కు తరలించామని సీఐ, ఎస్సైలు వివరించారు. త్వరలోనే మిగతా నిందితులపై చర్యలు తీసుకుంటామని సీఐ హామీ ఇవ్వడంతో గ్రామస్తు లు రాస్తారోకో విరమించారు. అనంతరం తహసీల్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి వినతిపత్రం అందజేశారు. బాధితుడు రొయ్యల సురేశ్కు సరైన న్యాయం జరిగే వరకు తాము ఊరుకోబోమని గ్రామస్తులు స్పష్టం చేశారు.
ఓ వర్గానికి పోలీసులు అనుకూలంగా
వ్యవహరిస్తున్నారని ఆరోపణ
మోర్తాడ్లో జాతీయ రహదారిపై
గ్రామస్తుల రాస్తారోకో
తహసీల్ కార్యాలయం వరకు ర్యాలీ