
‘రైతునేస్తం’ సద్వినియోగం చేసుకోవాలి
జక్రాన్పల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమ లు చేస్తున్న ‘రైతునేస్తం’ కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ రూ రల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి, కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతువేదికలకు వీడియో కాన్ఫరెన్స్ వ్యవస్థను అనుసంధానం చేస్తూ ‘రైతునేస్తం’ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం వర్చువల్గా ప్రారంభించారు. అనంతరం రైతుభరోసా నిధులను విడుదల చేశారు. జ క్రాన్పల్లి మండలం అర్గుల్ రైతువేదికలో నిర్వహించిన కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆధునిక సాంకేతికతను సాగు రంగానికి అనుసంధానం చేస్తూ, రైతుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం రైతునేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. రైతునేస్తం ద్వారా ప్రతి మంగళవారం వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులను సంప్రదించి సమస్యలను పరిష్కరించుకునే వెసులుబాటు ఏర్పడిందన్నారు. రుణమాఫీలో జిల్లా రైతాంగానికి రూ. 755.29 కోట్ల మేర లబ్ధి చేకూరగా, అత్యధికంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రూరల్ నియోజక వర్గ రైతులకు రూ. 205 కోట్ల లబ్ధి చేకూరిందని హ ర్షం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో ఆర్మూర్ ఆర్డీవో రాజాగౌడ్, జిల్లా వ్యవసాయ అధికారి వీరాస్వామి, ఐడీసీఎంఎస్ మాజీ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, శేఖర్ గౌడ్, సొసైటీల చైర్మన్లు పాల్గొన్నారు.
రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి,
కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి