
సీపీని కలిసిన బెటాలియన్ కమాండెంట్
ఖలీల్వాడి: నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీ సాయి చైతన్యను సోమవారం డిచ్పల్లి ఏడో బెటాలియన్ కమాండెంట్ సత్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా ఆయనకు పూల మొక్కను అందజేశారు.
తండ్రిని హతమార్చిన
కూతురు
నవీపేట: ఫాదర్స్ డే మరునాడే కన్న కూతురు చేతిలో తండ్రి హతమైన ఘటన మండలంలోని ధర్మారం(ఎ) గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. ధర్మారం గ్రామానికి చెందిన పల్లపు నర్సయ్య(54) సోమవారం మధ్యాహ్నం ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో తాళ్ల కొత్తపేటలో ఉండే చిన్నకూతురు మక్కల వర్షిణి అలియాస్ మమత రోకలి దుడ్డుతో తలపై బాది చంపేసింది. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి, నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్సై వినయ్లు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడి అన్న కొడుకు గంగారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని, విచారిస్తున్నట్లు ఎస్సై వినయ్ తెలిపారు.

సీపీని కలిసిన బెటాలియన్ కమాండెంట్