
నేలకొరిగిన స్తంభాలు.. రోడ్డుపైనే వైర్లు
డొంకేశ్వర్(ఆర్మూర్): మండలంలోని చిన్నయానంలో వారం రోజుల క్రితం గాలివాన కారణంగా విద్యుత్ వైర్లపై చెట్టు విరిగిపడింది. అలాగే రెండు కరెంట్ స్తంభాలు నేలకొరిగాయి. కానీ ఇప్పటి వరకు ట్రాన్స్కో అధికారులు మరమ్మతులు చేపట్టలేదు. ఇదే దారిగుండా ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతానికి పర్యాటకులు వచ్చి వెళ్తున్నారు. దీంతో విద్యుత్ సరఫరా జరిగితే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
వారం రోజులైనా మరమ్మతులు
చేపట్టని అధికారులు

నేలకొరిగిన స్తంభాలు.. రోడ్డుపైనే వైర్లు