
నాటి ఢంకేశ్వర్.. నేటి డొంకేశ్వర్
మీకు తెలుసా?
ఎస్సారెస్పీలో ముంపునకు గురైన డొంకేశ్వర్ గ్రామానికి పెద్ద చరిత్రే ఉంది. ఢంకలు మోగించడంతోనే ఈ ఊరికి మొదట ఢంకేశ్వర్ అనే పేరు వచ్చిందట. కాలక్రమేనా డొంకేశ్వర్గా మారింది.
● సుమారు 300 ఏళ్ల కిందట భుజంగరావు అనే వ్యక్తి నాలుగు ఎకరాల్లో ఊరిని, ఊర చెరువును స్థాపించాడు.
● ఊరికి నలు దిక్కులా బురుజులు కట్టి గడిని ఏర్పాటు చేసినట్లు చరిత్ర ఉంది.
● ఈ బురుజుల వద్ద సిపాయిలు కాపలా ఉండేవారు. ఢంకలు కొట్టి సంకేతాలు ఇచ్చేవారు.
● కొన్ని రోజులకు పొద్దుటూరి రెడ్డిలు వచ్చి నాలుగెకరాల్లో ఉన్న గ్రామాన్ని 40 ఎకరాలకు విస్తరించారు. మాసం చెరువును కూడా స్థాపించాడు.
● 1975లో ఎస్సారెస్పీలో ముంపునకు గురికావడంతో ప్రస్తుతం ఉంటున్న ప్రాంతంలో నివాసాలు కట్టుకున్నారు.
● సత్య గంగవ్వ, ఆమె కొడుకు మధుసూదన్రెడ్డి సహకారంతో ఊరి పున: నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసి భూములను పంచుకున్నారు.
● ఇళ్ల విస్తీర్ణం 80 ఎకరాల్లో ఉండగా, వ్యవసాయ భూములు 2వేలకు పైగా ఎకరాల్లో ఉంది. డొంకేశ్వర్ గ్రామానికి 1952లో భూమారెడ్డి మొదటి సర్పంచ్గా పని చేశారు.
– డొంకేశ్వర్(ఆర్మూర్)