జిల్లా తైక్వాండో అసోసియేషన్‌ కార్యవర్గం ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

జిల్లా తైక్వాండో అసోసియేషన్‌ కార్యవర్గం ఎన్నిక

Jun 16 2025 7:23 AM | Updated on Jun 16 2025 7:23 AM

జిల్లా తైక్వాండో అసోసియేషన్‌ కార్యవర్గం ఎన్నిక

జిల్లా తైక్వాండో అసోసియేషన్‌ కార్యవర్గం ఎన్నిక

నిజామాబాద్‌ నాగారం: నిజామాబాద్‌ జిల్లా తైక్వాండో అసోసియేషన్‌ నూతన కార్యవర్గం ఏర్పాటయింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మీర్‌ వాహజ్‌ అలీ ఈ ఎన్నికలకు ముఖ్య అతిథిగా హాజరు కాగా, ఆయన సమక్షంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చైర్మన్‌గా డాక్టర్‌ రమేష్‌ పవర్‌, అధ్యక్షుడిగా మహమ్మద్‌ అజ్మత్‌ ఖాన్‌, ప్రధాన కార్యదర్శిగా వినోద్‌ నాయక్‌, కోశాధికారిగా వినోద్‌, ఉపాధ్యక్షులుగా వాగ్మారే సుభాష్‌, శ్యామ్‌, మంజునాథ్‌, వినోద్‌రెడ్డి, రాము, సంయుక్త కార్యదర్శులుగా ప్రశాంత్‌ కుమార్‌, బుచ్చన్న, మురళి, వినోద్‌, ప్రవీణ్‌, సంతోష్‌ ఎన్నికయ్యారు. పూర్తి కార్యవర్గాన్ని త్వరలో నియమిస్తానని అధ్యక్షుడు అజ్మత్‌ ఖాన్‌ వెల్లడించారు. ఎన్నికలకు ఎలక్షన్‌ ఆఫీసర్‌గా ఫుట్‌బాల్‌ కోచ్‌ నాగరాజు వ్యవహరించారు. ఒలింపిక్‌ అసోసియేషన్‌ అబ్జర్వర్‌గా అబ్దుల్‌ ఉమర్‌ వ్యవహరించారు. నెట్‌ బాల్‌ అసోసియేషన్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, జిల్లా వెయిట్‌ లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి జయపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement