వికసిత్‌ భారత్‌ శిక్ష అధిక్షణ్‌ బిల్లు పత్రాలు దహనం | - | Sakshi
Sakshi News home page

వికసిత్‌ భారత్‌ శిక్ష అధిక్షణ్‌ బిల్లు పత్రాలు దహనం

Dec 20 2025 9:27 AM | Updated on Dec 20 2025 9:27 AM

వికసిత్‌ భారత్‌ శిక్ష అధిక్షణ్‌ బిల్లు పత్రాలు దహనం

వికసిత్‌ భారత్‌ శిక్ష అధిక్షణ్‌ బిల్లు పత్రాలు దహనం

తెయూ(డిచ్‌పల్లి): ఎస్‌ఎఫ్‌ఐ ఆలిండియా కమిటీ పిలుపులో భాగంగా శుక్రవారం తెలంగాణ యూనివర్సిటీ ఎస్‌ఎఫ్‌ కమిటీ ఆధ్వర్యంలో ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజ్‌ ఎదుట వికసిత్‌ భారత్‌ శిక్ష అధిక్షణ్‌ బిల్లు పత్రాలను దహనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు దీపిక మాట్లాడుతూ.. ప్రస్తుతం నూత న జాతీయ విద్యా విధానంలో భాగంగా విద్యను మరింతగా ప్రైవేటీకరణ, వ్యాపారీకరణ, కాషాయీకరణ చేయడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేయడం సరికాదన్నారు. యూజీసీ పేరుతో గత ప్రభుత్వాలు విద్యాసంస్థల అభివృద్ధి కోసం గ్రాంట్లను అందించేవి కానీ ఈ బిల్లుతో విద్యారుణాలను అందించే దుస్థితికి తీసుకురావడం సిగ్గుచేటని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి కారం చక్రి, యూనివర్సిటీ నాయకురాలు బాలమణి, కుమారి, సాయి, రాము, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement