ప్రతిభా పురస్కారాలు ప్రదానం | - | Sakshi
Sakshi News home page

ప్రతిభా పురస్కారాలు ప్రదానం

Jun 7 2026 11:39 PM | Updated on Jun 7 2026 11:39 PM

నిర్మల్‌ఖిల్లా: జిల్లా కేంద్రంలోని పెన్షనర్స్‌ భవ న్‌లో ఏకలవ్య, దివ్యాంగ శక్తి ఫౌండేషన్ల ఆధ్వర్యంలో ఆదివారం ప్రతిభా పురస్కారాలు ప్ర దానం చేశారు. నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదోతరగతిలో మండల స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, దివ్యాంగ విద్యార్థులను సన్మానించి పురస్కారాలు అందజేశారు. జిల్లా సీనియర్‌ సివిల్‌ జడ్జి రాధిక, డీఈవో భోజన్న హాజరై మాట్లాడా రు. ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య, మౌలి క వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఫౌండేష న్ల సేవలను ప్రశంసించారు. ఏకలవ్య ఫౌండేష న్‌ చైర్మన్‌ వెంకట్రావు, ట్రస్టీ ది గంబర్‌, బాధ్యులు ప్రశాంత్‌, రామ్మోహన్‌, శంకర్‌, ముత్యం, దివ్యాంగ శక్తి ఫౌండేషన్‌ చైర్మన్‌ మహేశ్‌, ఎంసీ లింగన్న, ఎంఈవోలు పద్మ, సంధ్యారాణి, సదానంద్‌, నరేందర్‌, శ్రీహరి ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement