టార్గెట్‌ 100% | - | Sakshi
Sakshi News home page

టార్గెట్‌ 100%

Jan 24 2026 8:48 AM | Updated on Jan 24 2026 8:48 AM

టార్గ

టార్గెట్‌ 100%

● పదో తరగతి సిలబస్‌ పూర్తి.. ● ఉత్తమ ఫలితాలకు ప్రత్యేక స్టడీ అవర్స్‌ ● జిల్లాలో 9,932 మంది విద్యార్థులు ● విద్యార్థులను సబ్జెక్టుల ప్రకారం విభజించి శిక్షణ ఇస్తున్నారు. ● ప్రతీ సబ్జెక్టు ఉపాధ్యాయుడు 10 మంది విద్యార్థులకు దత్తత తీసుకుని ఉదయం వేకప్‌ కాల్స్‌, రాత్రి చదువు రిమైండర్లు ఇస్తున్నారు. ● రోజూ విషయాలపై పరీక్షలు నిర్వహించి వెంట నే మూల్యాంకనం చేస్తున్నారు. ● ఉదయం 8 నుంచి 9, సాయంత్రం 4:15 నుంచి 5:30 గంటల వరకు స్టడీ అవర్స్‌ నిర్వహిస్తున్నారు. ● చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వ్యక్తిగత శ్రద్ధలు చూపుతున్నారు. ● పాఠశాల సమయంలో సబ్జెక్టుల వారీగా వి ద్యార్థుల సందేహాలు నివృత్తి చేస్తున్నారు. ● వ్యక్తిత్వ నిపుణులతో పరీక్ష భయాన్ని తొలగించి ఆత్మవిశ్వాసం పెంపొందిస్తున్నారు. ● పాత పరీక్ష మోడల్‌ పేపర్లతో అభ్యాసం చేయిస్తున్నారు. ● అధికారులు పాఠశాలలు సందర్శించి విద్యార్థులతో చర్చలు జరుపుతున్నారు.

లక్ష్మణచాంద: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి సిలబస్‌ పూర్తయింది. గ్రామ సర్పంచ్‌ ఎన్నికల కారణంగా కొంత ఆలస్యం అయినా, ప్రత్యేక తరగతులతో లక్ష్యాన్ని సాధించామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఇక ఇప్పుడు విద్యార్థుల సంసిద్ధతపై దృష్టి పెట్టారు.

వంద శాతం ఉత్తీర్ణతకు..

గత సంవత్సరంకన్నా మెరుగైన ఫలితాల కోసం జిల్లా విద్యాశాఖ ప్రణాళికాబద్ధ చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 9,932 మంది విద్యార్థులు (కేజీబీవీ, ఆదర్శ పాఠశాలలు, ఎంజేపీ, మైనారిటీ, ట్రైబల్‌ వెల్ఫేర్‌ సహా) 100% గెలుపు సాధించేలా సన్నద్ధమవుతున్నారు.

ప్రత్యేక చర్యలు ఇలా..

మెరుగైన ఫలితాల సాధనకు..

గతేడాది పదో తరగతి ఫలితాలలో నిర్మల్‌ జిల్లా 15వ స్థానంలో నిలిచింది. ఈసారి మెరుగైన ఫలితాలు సాధించి ఉత్తమ ర్యాంకు సాధించేలాగా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నాం. జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలన్నీ 100 శాతం ఫలితాలు సాధించేలాగా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నాం.

– భోజన్న, డీఈవో

టార్గెట్‌ 100% 1
1/1

టార్గెట్‌ 100%

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement