నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Jun 17 2025 4:55 AM | Updated on Jun 17 2025 4:55 AM

నిర్మ

నిర్మల్‌

.. గోదావరిలో దీపమే!
బాసర వద్ద గోదావరిలో భక్తుల ప్రాణాలకు భద్రత కరువైంది. పుణ్యస్నానాలకు వచ్చిన భక్తులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. భద్రత, రణక్ష చర్యలు కానరావడం లేదు.

మంగళవారం శ్రీ 17 శ్రీ జూన్‌ శ్రీ 2025

నిర్మల్‌ మెడికల్‌ కాలేజీ

యోగా వాక్‌

నిర్మల్‌టౌన్‌: యోగాతో మానసిక, శారీరక దృఢత్వం పెరుగుతుందని ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్‌ కృష్ణంరాజు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం దశాబ్ది వేడుకల్లో భాగంగా ఆయుష్‌ విభాగం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ మినీ స్టేడియంలో సోమవారం ‘యోగా వాక్‌ ’ నిర్వహించారు. అనంతరం ప్రధాన రహదారుల గుండా ర్యాలీ తీశారు. కార్యక్రమంలో ఎస్‌ఎంవో నారాయణరావు, డాక్టర్‌ సంధ్యారాణి, డీపీవో శ్రావణ్‌, డీపీవో నవీన్‌, ఆయుష్‌ విభాగం సభ్యులు, ఆశ వర్కర్లు, యోగా శిక్షకురాలు చైతన్య, ప్రదీప్‌పవిత్ర, పరికిపండ్ల స్వదేశ్‌, ఎస్పీ రవీంద్ర, అడప నవీన్‌ పాల్గొన్నారు.

హాస్టల్‌ కొంత ఇబ్బందే..

మెడికల్‌ కాలేజీకి సంబంధించి ప్రస్తుతం కొనసాగుతున్న భవనం సెకండియర్‌ వరకు పెద్దగా ఇబ్బంది లేకుండా కొనసాగించవచ్చు. కానీ.. మూడోసంవత్సరంలోకి అడుగుపెడితే ఇబ్బందులు తప్పేలా లేవు. ఇప్పటికీ ఇక్కడ విద్యార్థుల వసతికి కొంత సమస్యగానే ఉంది. బాలురకు కళాశాల భవనంలోనే హాస్టల్‌ వసతి కొనసాగిస్తున్నారు. బాలికలకు మాత్రం పాలిటెక్నిక్‌ కళాశాల భవనంలో వసతి ఏర్పాటు చేశారు. ఇద్దరికీ ప్రత్యేకంగా వసతి గృహాలను నిర్మించాల్సిన అవసరం ఉంది.

నిర్మల్‌: జిల్లాకు పెద్దదిక్కుగా ఉన్న మెడికల్‌ కాలేజీపై నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌(ఎన్‌ఎంసీ) కత్తి వేలాడుతోంది. వైద్యకళాశాల రెండో ఏడాదిలోకి అడుగుపెట్టినా పాలకుల పట్టింపులేనితనంతో చాలా సమస్యలు అలాగే ఉన్నాయి. కాలేజీ అనుమతి రద్దు చేసేదాకా పరిస్థితి తెచ్చుకోవద్దని ఎన్‌ఎంసీ హెచ్చరిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 26 కాలేజీలపై అసంతృప్తి వ్యక్తంచేసింది. ఈనెల 18న నేరుగా హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌(డీఎంఈ)ని ఆదేశించింది. డీఎంఈతోపాటు ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లు సైతం వర్చువల్‌గా అందుబాటులో ఉండాలని సూచించింది. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం డీఎంఈ, ప్రిన్సిపాళ్లతో సమావేశమయ్యారు.

అదే భవనంలో..

రెండేళ్లలో 20 ఎకరాలలో రూ.166 కోట్లతో శాశ్వత మెడికల్‌ కళాశాల భవనాలు అందుబాటులోకి వచ్చేలా నిర్మాణాలు చేపడతామని మెడికల్‌ కాలేజీ ప్రారంభోత్సవ సమయంలో అప్పటి పాలకులు తెలిపారు. రెండేళ్లు గడిచినా.. సెకండియర్‌ తరగతులు ప్రారంభమైనా భవనాల ఊసులేదు. ఇప్పటికీ కొత్త భవనాలకు అడుగు కూడా ముందుకు పడలేదు. ప్రస్తుతం భీమన్నగుట్ట పక్కన కొనసాగుతున్న మెడికల్‌ కాలేజీ భవనం జిల్లా ఆస్పత్రి కోసం కేటాయించింది. ఐదెకరాల స్థలంలో నిర్మాణాలు చేపట్టారు. అనంతరం జిల్లాకు మెడికల్‌ కాలేజీ కేటాయించడంతో అదేస్థలంలో రూ.40 కోట్లతో మొదటి సంవత్సరం విద్యార్థులకు సరిపోయేలా, వారి బోధనకు వీలుగా నిర్మాణం మార్చారు. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరానికి చేరుకున్నా.. కొత్త భవనాల జాడ కనిపించడం లేదు.

బోధనా సిబ్బంది అవసరమే..

ఎన్‌ఎంసీ చేసిన హెచ్చరికల్లో ప్రధానంగా వైద్య విద్యార్థులకు కావల్సిన బోధనా సిబ్బంది లేరన్న విషయం ప్రధానంగా ఉంది. నిర్మల్‌ మెడికల్‌ కాలేజీకి సంబంధించి ప్రస్తుతం 62 మంది వైద్యులు ఉన్నారు. రాష్ట్రంలోని మిగతా మెడికల్‌ కాలేజీలతో పోలిస్తే ఇక్కడ సరిపడా బోధనా సిబ్బంది ఉన్నట్లు చెబుతున్నారు. కానీ.. మున్ముందు ఈ సిబ్బంది సరిపోని పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ కనీసం వందమంది ఉండాల్సిన అవసరం ఉంది.

సీఎం సమీక్ష..

ఎన్‌ఎంసీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలోనే మెడికల్‌ కాలేజీల తీరుపై సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. కళాశాలల్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కళాశాలల్లో క్షేత్రస్థాయి పరిశీలనకు అధికారులతో కమిటీ వేయాలని సూచించారు. మూడేళ్లలో అన్ని వసతులు సమకూర్చాలని, అవసరమైన నిధులు ప్రభుత్వం విడుదల చేస్తుందని చెప్పారు. మరోవైపు బుధవారం డీఎంఈ, ప్రిన్సిపాళ్లతో నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ ఏం మాట్లాడుతుందో.. ఏం చర్యలు తీసుకుంటుందో..అన్న విషయంపైనే కొంత కలవరం నెలకొంది.

న్యూస్‌రీల్‌

పెద్దగా ఇబ్బంది లేదు..

రాష్ట్రంలోని మిగతా కాలేజీలతో పోలిస్తే నిర్మల్‌ వైద్యకళాశాలలో పెద్దగా ఇబ్బందులు లేవు. ఇక్కడ భవనం, సిబ్బంది ప్రస్తుతానికి సరిపడా ఉన్నారు. ఎన్‌ఎంసీతో వర్చువల్‌ సమావేశానికి హాజరు అవుతాము. – శ్రీనివాస్‌, ప్రిన్సిపాల్‌, మెడికల్‌కాలేజీ

నిర్మల్‌1
1/1

నిర్మల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement