
సమస్యల పరిష్కారానికి వేదిక
ఖానాపూర్: విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సేవలు అందేలా చూడడంతోపాటు వారి సమస్యల పరిష్కారానికి విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక పనిచేస్తుందని వేదిక చైర్మన్ ఇ.నారాయణ తెలిపారు. పట్టణంలోని విద్యుత్ శాఖ కార్యాలయం ఆవరణలోని ఈఆర్వో ఆఫీస్ ఆవరణలో విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక(సీజీఆర్ఎఫ్–2, నిజామాబాద్) ఆధ్వర్యంలో మంగళవారం జరిగింది. ఖానాపూర్, కడెం, పెంబి, దస్తూరాబాద్, మామడ మండలాలకు చెందిన వినియోగదారులు సదస్సులో పాల్గొన్నారు. నారాయణ మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులకు ఎలాంటి సమస్యలు ఉన్నా స్థానిక కార్యాలయాల్లోని అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. అయినా పరిష్కారం కాకపోతే నిజామాబాద్లోని సీజీఆర్ఎఫ్ కార్యాలయంలో ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతిలో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా వినియోగదారుల నుంచి 9 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. అంతకుముందు జాతీయ మానవహక్కుల కమిటీ జిల్లా అధ్యక్షుడు ఎంఏ వకీల్తో పాటు సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎల్ఆర్ ఉపాలి, బీజేపీ నాయకులు నాయిని సంతోష్, తదితరులు పలు సమస్యలపై వేర్వేరుగా వినతిపత్రాలను ఇచ్చారు. సమావేశంలో కన్జూమర్స్ ఫోరం టెక్నికల్ సభ్యుడు రామకృష్ణ, ఫైనాన్స్ సభ్యుడు కిషన్, ఎస్ఈ సుదర్శనం, డీఈఈ నాగరాజు, ఏడీ శ్రీనివాస్, ఏఈ రాంసింగ్ తదితరులు పాల్గొన్నారు.