ఆదిలోనే అన్నదాత చిత్తు! | - | Sakshi
Sakshi News home page

ఆదిలోనే అన్నదాత చిత్తు!

Jun 18 2025 3:11 AM | Updated on Jun 18 2025 3:11 AM

ఆదిలో

ఆదిలోనే అన్నదాత చిత్తు!

నిర్మల్‌
అడ్రస్‌ లేని అత్యవసర సేవలు
బాసర అమ్మ చెంత అత్యవసర సేవలు అంద డం లేదు. గోదావరిలో మునిగినా, రోడ్డు ప్ర మాదం జరిగినా చికిత్సకు భైంసా లేదా నిజామాబాబాద్‌ వెళ్లాల్సిన పరిస్థితి.
● జిల్లాలో నకిలీ విత్తనాలు.. నిషేధిత రసాయన మందులు ● డీఏపీ కొరతతో రైతులకు ఇబ్బందులు ● అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యాపారులు ● నిద్రమత్తులో జిల్లా వ్యవసాయ శాఖ

గుడిలో గుప్తనిధుల వేట

కడెం మండలం కల్లెడ, దోస్త్‌నగర్‌ మధ్యన ఉన్న కొండపై వెలసిన లక్ష్మీనారసింహ ఆలయంలో దుండగులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు.

9లోu

బుధవారం శ్రీ 18 శ్రీ జూన్‌ శ్రీ 2025

8లోu

పరిసరాలు పరిశుభ్రంగా

ఉంచుకోవాలి

సీనియర్‌ సివిల్‌ జడ్జి రాధిక

నిర్మల్‌టౌన్‌: పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి రాధిక ఉపాధ్యాయులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని కస్బా ప్రభుత్వ ఉన్నత పాఠశాలను మంగళవారం సందర్శించారు. పాఠశాలలో సదుపాయాలపై ఆరా తీశారు. తరగతి గదుల సౌలభ్యం, తాగునీరు వసతి సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో పాముల బెడద లేకుండా చూడాలని తెలిపారు. పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటాలన్నారు. ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. విద్యార్థులకు చదువు ప్రాధాన్యత తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాది లింగగౌడ్‌, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుసూదన్‌, పీడీ భూమన్న, స్నేక్‌ స్నాచర్‌ వనీల్‌, ఉపాధ్యాయులు లక్ష్మీనారాయణ, దశరథ్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

భైంసాటౌన్‌: ఖరీప్‌ సాగు పనులు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. భూములు సాగుకు సిద్ధం చేసుకున్న రైతులు విత్తనాలు, ఎరువుల కొనుగోలు లో బిజీగా ఉన్నారు. అయితే ఇదే అదనుగా నకిలీ దందాకు తెరలేపారు వ్యాపారులు. రైతులు అడిగిన విత్తనాలు, ఎరువులు కాకుండా గుర్తింపు లేని కంపెనీల విత్తనాలు, ఎరువులు అంటగడుతూ ఆదిలో నే రైతులను చిత్తు చేస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతులు మోసపోతున్నారు. భైంసా మండలంలోని టాక్లి గ్రామానికి చెందిన రైతు దండేకర్‌ రాందాస్‌, భైంసాలోని ఓ విత్తన డీలర్‌ వద్ద రవి ఉన్నతి రకం సోయా విత్తనాలు కొనుగోలు చేశాడు. విత్తనాలను విత్తే సమయంలో అవి చెడిపోయి ఉన్నట్లు గుర్తించాడు. వ్యా పారిని సంప్రదించగా, వారు కంపెనీ దృష్టికి తీసుకెళ్తామని సమాధానం ఇచ్చారు. సోమవారం రాందాస్‌ కొందరు రైతులతో కలిసి భైంసాలోని ఏడీఏ కార్యాలయానికి వెళ్లగా, అధికారులు అందుబాటులో లేరు. చివరకు ఓ అధికారి వచ్చి, వ్యాపారితో ఫోన్‌లో మాట్లాడి మరో విత్తన సంచి సర్దుబాటు చేయాలని సూచించారు. డీఏవోను సంప్రదించినా ఇదే సమాధానం రావడం గమనార్హం. రైతులకు అండగా నిలవాల్సిన అధికారులు వ్యాపారులకు వత్తాసు పలుకుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

అక్రమ నిల్వలపై తనిఖీలు

లక్ష్మణచాంద మండల కేంద్రంలోని ఫర్టిలైజర్‌ దు కాణాల్లో కరీంనగర్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఇటీవల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 575 సంచుల 20:20 ఎరువులు, 117 డీఏపీ బస్తాలు, 26 పొటాష్‌ బస్తాలు అక్రమంగా నిల్వ ఉన్నట్లు గుర్తించి సీజ్‌ చేశారు. అంతేకాక, సరైన బిల్లులు లేని 24.5 లీటర్ల నిషేధిత గ్లైఫోసెట్‌ మందును స్వాఽ దీనం చేసుకున్నారు. ఈ తనిఖీలు జిల్లా వ్యవసాయ శాఖ మొక్కుబడి పనితీరుకు అద్దం పడుతోంది.

డీఏపీ కొరత..

జిల్లావ్యాప్తంగా డీఏపీ కొరత తీవ్రంగా ఉంది. జిల్లాకు 7 వేల టన్నుల డీఏపీ అవసరమని వ్యవసాయ అధికారులు అంచనా వేయగా, 6 వేల టన్నుల స్టాక్‌ వచ్చింది. 90 శాతం అమ్ముడైనట్లు అధికారులు చెబుతున్నారు. మార్కెట్‌లో డీలర్లు డీఏపీ లేదని రైతులకు చెబుతున్నారు. తెలిసిన వారికి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. మహారాష్ట్రకు ఎరువులను తరలిస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఇటీవల కుభీర్‌ ప్రాంతంలో ఎరువుల లోడ్‌తో వెళ్తున్న వాహనం పట్టుబడడమే ఇందుకు నిదర్శనం. సహకార సంఘాలకు కూడా డీఏపీ పూర్తిస్థాయిలో సరఫరా కాకపోవడంతో, రైతులు అధిక ధరలకు వ్యాపారుల వద్ద కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది.

న్యూస్‌రీల్‌

అధిక ధరలకు విక్రయం

డీఏపీ రూ.1,450కి కొన్నా...

డీఏపీ కొరత పేరుతో వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. నేను భైంసాలోని ఓ దుకాణంలో 8 సంచులు కొన్న. ఒక్కొక్కటి రూ.1,450 చొప్పున ఇచ్చారు. బిల్లు అడిగితే ఇవ్వడం లేదు. కొందరికి రూ.1,350 ధర వేసి రశీదు ఇస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలి.

– సాయినాథ్‌, రైతు, భైంసా

ఫిర్యాదు చేయాలి..

జిల్లాలో డిమాండ్‌ మేరకు ఎరువుల స్టాక్‌ ఉంది. మొత్తం 6 వేల టన్నులకుగాను 5 వేల టన్నులు జిల్లాకు చేరింది. ప్రస్తుతం డీలర్ల వద్ద మరో 1,600 టన్నులు అందుబాటులో ఉంది. డీలర్లు డీఏపీ స్టాకు లేదన్నా, అధిక ధరకు విక్రయించినా వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేయాలి.

– అంజిప్రసాద్‌, జిల్లా వ్యవసాయాధికారి

భైంసా మార్కెట్‌లో కొందరు వ్యాపారులు డీఏపీ బస్తాలను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. డీఏపీ బస్తా రూ.1,350కి విక్రయించాల్సి ఉండగా, రూ.1,400 నుంచి రూ.1,500కి, 20:20 బస్తా రూ.1,280కి ఉండగా, రూ.1,300 నుంచి రూ.1,350కి, 10:26:26 బస్తా రూ.1,800కి విక్రయిస్తున్నారు. రైతులు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు ఎరువుల కొరత లేదని చెబుతున్నా క్షేత్రస్థాయిలో రైతులకు స్టాక్‌ లేదనే సమాధానం వస్తోంది. ఈ నిర్లక్ష్య వైఖరి రైతుల ఆగ్రహానికి కారణమవుతోంది.

ఆదిలోనే అన్నదాత చిత్తు! 1
1/3

ఆదిలోనే అన్నదాత చిత్తు!

ఆదిలోనే అన్నదాత చిత్తు! 2
2/3

ఆదిలోనే అన్నదాత చిత్తు!

ఆదిలోనే అన్నదాత చిత్తు! 3
3/3

ఆదిలోనే అన్నదాత చిత్తు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement