అర్జీలు వేగంగా పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

అర్జీలు వేగంగా పరిష్కరించాలి

Jun 17 2025 4:55 AM | Updated on Jun 17 2025 4:55 AM

అర్జీ

అర్జీలు వేగంగా పరిష్కరించాలి

నిర్మల్‌చైన్‌గేట్‌: ప్రజావాణిలో వచ్చిన అర్జీలను సమగ్రంగా పరిశీలించి, వేగంగా పరిష్కరించాలని కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 68 అర్జీలు వచ్చాయి. వాటిని సంబంధిత శాఖల అధికారులకు అందించి, పరిష్కారంలో జాప్యం చేయొద్దని సూచించారు. శాఖల వారీగా పెండింగ్‌ లో ఉన్న దరఖాస్తుల స్థితిపై సమీక్షించారు. ప్రతీ దరఖాస్తును క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి తక్షణమే స్పందించాలన్నారు. వానాకాలం నేపథ్యంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం జరుగకుండా చూడాలన్నారు. రైతులకు విత్తనాలు, ఎరువుల సరఫరాలో ఆటంకాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్‌ అహ్మద్‌, కిశోర్‌కుమార్‌, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

చెత్త బండి రావడం లేదు..

మేము బంగల్‌పేట సమీ పంలో ఉన్న నాగనాయిపేట కాలనీవాసులం. ఏడాదిగా మా కాలనీకి చెత్త బండి రావడం లేదు. మున్సిప ల్‌ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదు. ప్రజావాణిలో కూడా రెండుసార్లు ఫిర్యాదు చేశాను. చెత్త బండి రాక రోడ్డుపై వేసిన చెత్తను కోతులు, పందులు చిందరవందర చేస్తున్నాయి. దోమలు, ఈగలు, దు ర్వాసనతో ఇబ్బంది పడుతున్నాం. చెత్త బండి వచ్చేలా చూడండి. – నవీన్‌, నాగనాయి పేట్‌

చేపల వేటకు అనుమతి ఇప్పించండి

మేము దస్తురాబాద్‌ మండలం మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులం. 1974 నుంచి చేపల వేటకు లైసెన్సులు పొందుతూ చేపలు పట్టుకుని ఉపాధి పొందుతున్నాం. రాంపూర్‌కు చెందిన మత్స్యకారులు అక్కడ చేపలు పట్టకూడదని మమ్మల్ని కర్రలతో కొట్టి, మా కళ్లలో కారంపొడి చల్లి, గొడ్డళ్లతో దాడి చేస్తున్నారు. 61 కుటుంబాలకు చెందిన మేము ఇదే వృత్తిపై ఆధారపడి ఉన్నాం. రాంపూర్‌ మత్సకారులపై చట్టరీత్యా చర్య తీసుకుని మాకు చేపల వేటకు అనుమతి ఇప్పించండి.

– దస్తురాబాద్‌ మత్స్యకారులు

నకిలీ నియామక పత్రంతో మోసం..

మాది పెంబి మండలం మందపల్లి గ్రామం. రెండేళ్ల క్రితం ఖానాపూర్‌ మండలం రాజురాకు చెందిన కొల్పుల హరీశ్‌ నా కుమారునికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.ఆరు లక్షలు తీసుకున్నాడు. ఆదాయ పన్ను శాఖలో సహాయకునిగా నియమిస్తున్నట్టు చూపించే నియామక పత్రం అందజేశాడు. తనకు పరిచయం ఉన్నచోట కొన్ని రోజులు ఉద్యోగం చేయించి తొలగించారు. గత అక్టోబర్‌లో పెద్దమనుషులను తీసుకెళ్లి న్యాయం అడగగా డబ్బులు జనవరిలో తిరిగి ఇస్తానని కాగితం రాసి ఇచ్చాడు. ఇప్పుడు ఆ డబ్బు అడిగితే ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని బెదిరిస్తున్నాడు. ఇటువంటి వ్యక్తిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలి.

– జల్ల నర్సయ్య, మందపల్లి

కలెక్టర్‌ అభిలాష అభినవ్‌

అర్జీలు వేగంగా పరిష్కరించాలి 1
1/3

అర్జీలు వేగంగా పరిష్కరించాలి

అర్జీలు వేగంగా పరిష్కరించాలి 2
2/3

అర్జీలు వేగంగా పరిష్కరించాలి

అర్జీలు వేగంగా పరిష్కరించాలి 3
3/3

అర్జీలు వేగంగా పరిష్కరించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement