
నిర్మల్
సోమవారం శ్రీ 16 శ్రీ జూన్ శ్రీ 2025
గోదావరి నది నుంచి మృతదేహాలను బయటకు తీసుకువస్తున్న బాధిత కుటుంబీకులు
ఆర్జీయూకేటీ
అధ్యాపకుడికి డాక్టరేట్
బాసర: ఆర్జీయూకేటీ ఎలక్ట్రానిక్స్ అండ్ క మ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగధిపతి అసిస్టెంట్ ప్రొఫెసర్ బత్తిన ఉపేందర్రావుకు ఉ స్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ అందజేసింది. ‘ఇన్వెస్టిగేషన్స్ ఆన్ అప్లికేషన్స్ ఆఫ్ డిఫెక్టెడ్ గ్రౌండ్ స్ట్రక్చర్ ఆన్ మైక్రోస్ట్రిప్ పాథ్ ఆంటెన్నా’ అనే అంశంపై చేసిన పరిశోధనకు గాను డాక్టరే ట్ ఇచ్చింది. ఉపేందర్రావును ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్, అధ్యాపకులు ఆదివారం అభినందించారు. ఈ పరిశోధన ద్వారా వైర్లెస్ కమ్యూనికేషన్ వ్యవస్థల్లో హై డేటా రేట్ స్పీడ్ సాధ్యం కావచ్చని ఇన్చార్జి వీసీ వెల్లడించారు.
మదన్ (ఫైల్)
రాకేశ్, భరత్ (ఫైల్)
● నీట మునిగి ఐదుగురు మృతి
● మృతులంతా 22 ఏళ్లలోపు వారే
● నిర్మల్ జిల్లా బాసర వద్ద ఘటన
● మృతుల్లో ముగ్గురు అన్నదమ్ములు
● మిన్నంటిన తల్లిదండ్రుల రోదన
● ఆస్పత్రి సిబ్బంది తీరుపై ఆగ్రహం
భైంసా/భైంసాటౌన్/బాసర: బాసర గోదావరి నది ఐదుగురిని పొట్టన పెట్టుకుంది. పుణ్యస్నానాలకు నదిలోకి దిగిన యువకులను పరలోకాలకు పంపింది. వివరాలు.. హైదరాబాద్లో స్థిరపడిన రాజస్థాన్ కు చెందిన వ్యాపారి ప్రేమ్రాంకు భరత్ (16), మదన్ (18), రాకేశ్ (20) ముగ్గురు సంతానం. వీరిని హైదరాబాద్లో చదివిస్తున్నాడు. ప్రేమ్రాం తన మరదలి కొడుకై న వినోద్ (19)కు హైదరాబాద్లోనే ఎస్సార్ నగర్లో నీట్ కోచింగ్ ఇప్పించాడు. విద్యాసంవత్సరం ఆరంభంలో ప్రేమ్రాం ఎప్పటిలాగే తన భార్య సోను, ముగ్గురు కొడుకులతోపా టు మరదలి కొడుకైన వినోద్, బంధువుల కుమారుడు రుతిక్ (22)ను ఆదివారం రైలులో సరస్వతీ అమ్మవారి దర్శనానికి బాసరకు పంపించాడు. బా సరకు చేరుకున్న వీరు ముందుగా గోదావరిలో పుణ్యస్నానాలాచరించేందుకు వెళ్లారు. స్నాన ఘట్టా ల వద్ద నీరు మురికిగా ఉందని గోదావరినది మధ్యలో తేలిన ఇసుక తిన్నెల వద్ద స్నానం చేయాలని ని ర్ణయించుకున్నారు. అక్కడికి బోటులో వెళ్లి స్నానా లు చేస్తున్నారు. ఈ క్రమంలో లోతు తెలియక ప్రే మ్రాం–సోను దంపతుల ముగ్గురు కొడుకులతో పాటు మరదలి కుమారుడు వినోద్, మరో యువకుడు రుతిక్ నీట మునిగి విగతజీవులయ్యారు. వీరి మృతదేహాలను భైంసా ఏరియాస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం ప్రేమ్రాం–సోను కుమారుల మృతదేహాలతోపాటు వినోద్ మృతదేహాన్ని రాజస్థాన్కు పంపించారు. బంధువుల కుమారుడైన రుతిక్ మృతదేహాన్ని హైదరాబాద్కు పంపించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బాసర ఎస్సై శ్రీనివాస్ కేసు నమోదు చేశారు.
తల్లడిల్లిన తల్లి హృదయం
తన ముగ్గురు కొడుకులను కోల్పోయిన తల్లి సోను కన్నీరుమున్నీరుగా విలపించింది. ఆస్పత్రిలో కొడుకుల మృతదేహాలపై రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ముగ్గురు కొడుకులను కోల్పోయిన తాను ఇక బతికుండలేనని గుండెలవిసేలా రోదించింది. ఏదైనా వాహనం కింద పడి చనిపోతానని బయటకు పరుగెత్తింది. సమీప బంధువులు ఓదార్చి ఆమెను పక్కకు తీసుకెళ్లారు.
జవాబు లేని ప్రశ్నలు
ఆదివారం బాసర గోదావరిలో యువకులను పోగొ ట్టుకున్న కుటుంబీకులు ఆవేదనతో అడిగిన ప్రశ్నలు జవాబులు లేనివిగా మిగిలాయి. నీటిలో మునుగుతున్న తమ పిల్లలను కాపాడాలని ప్రాధేయపడ్డా ఎవరూ దగ్గరికి రాలేదని వాపోయారు. నది నీటిలో మునిగి కొన ఊపిరితో ఉన్న తమ పిల్లలను కాపాడాలని అరిచినా గోదావరి పరిసరాల్లో ఓ వైద్యుడు, సిబ్బంది కనిపించలేదన్నారు. సీపీఆర్ చేసినా, అ త్యవసర వైద్య సేవలు అక్కడే అంది ఉంటే పిల్లలు బతికేవారని బాధిత కుటుంబీకులు వాపోయారు. నీటి లోతు తెలిపే హెచ్చరించే బోర్డులు కూడా ఎక్క డా లేవని, అంబులెన్స్లో ఆస్పత్రికి వచ్చినా సరైన సేవలు అందలేదని ఆరోపించారు. బాధిత కుటుంబీకులు భైంసా ఏరియాస్పత్రిలో మీడియా ఎదుట అడిగిన ప్రశ్నలు జవాబులు లేనివిగా మిగిలాయి.
వరుస ఘటనలతో..
బాసరలో ఇటీవలి కాలంలో ఇలాంటి వరుస ఘట నలు జరుగుతున్నా పట్టింపు కరువైంది. మే 26న మహారాష్ట్ర నుంచి వచ్చిన కులదీప్బాబాసాహెబ్ అనే బాలుడు, నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం కమలాపూర్కు చెందిన యువకుడు బొల్లమల రాజు పుణ్యస్నానాల కోసం గోదావరిలోకి దిగి నీట మునిగి ఇదే ప్రాంతంలో మృతి చెందారు. గత జనవరి నుంచి ఇప్పటివరకు పదుల సంఖ్యలో మృతిచెందినా రక్షణ చర్యలు కరువయ్యాయి. ఎలాంటి హెచ్చరికలు జారీ చేయడం లేదు. లోతు, బురద ప్రాంతాల్లోనూ బోట్లు తిప్పుతున్నా నియంత్రించడంలేదు. స్నానఘట్టాల వద్ద చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోవడంతోనే భక్తులు అవగాహన లేకుండా గోదావరిలోని లోతైన ప్రాంతాలకు స్నానాలకు వెళ్లి ప్రమాదాల బారిన పడుతున్నారు. ఆలయ అధికారులు భక్తుల రక్షణ చర్యలపై దృష్టి సారించకపోవడం గమనార్హం.
గజ్జలమ్మదేవికి పూజలు
కుంటాల: మండల కేంద్రంలోని గజ్జలమ్మ ఆలయంలో ఆదివారం భక్తులు పూజలు చేశారు. గజ్జలమ్మ, ముత్యాలమ్మ, మహాలక్ష్మీ అమ్మవార్లకు అభిషేకం, అలంకరణ, హారతి, అర్చ న, పల్లకీసేవ నిర్వహించగా అధికసంఖ్యలో పాల్గొన్నారు. బోనాలను నైవేద్యంగా సమర్పించారు. మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు అధికసంఖ్యలో వచ్చారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదం పంపిణీ చేశారు.
తేమ లేకుండానే విత్తనం
రుతుపవనాలు వచ్చినా తొలకరి వర్షాలు ఇంకా పలకరించనేలేదు. అయినా మృగశిర కార్తె ప్రారంభం కావడంతో రైతులు ఖరీఫ్ పనులకు శ్రీకారం చుట్టారు.
8లోu
న్యూస్రీల్
ఫాదర్స్ డే రోజునే ఘటన
ఫాదర్స్ డే రోజే ఐదుగురు యువకులు దుర్మరణం చెందడం బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ‘హ్యాపీ ఫాదర్స్ డే’ అని చెప్పి రైలెక్కిన ముగ్గురు కొడుకులు తిరిగి రాని లోకాలకు వెళ్లడాన్ని ప్రేమ్రాం జీర్ణించుకోలేకపోతున్నాడు. తన కొడుకులతోపాటు మరదలి కొడుకు, బంధువుల కుమారుడి మృతి వార్త తెలిసి హుటాహుటిన హైదరాబాద్ నుంచి భైంసా ఏరియాస్పత్రికి చేరుకున్నాడు. విగతజీవులైన కొడుకులను చూసి బోరున విలపించాడు.

నిర్మల్

నిర్మల్

నిర్మల్

నిర్మల్