
పాఠశాలలో ఎకో క్లబ్లు
● పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల భాగస్వామ్యం ● ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ ● ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
విద్యార్థులకు అవగాహన
కల్పించే కార్యక్రమాలు
ఎకో క్లబ్ల ద్వారా విద్యార్థులకు కింది అంశాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తారు.
శక్తి ఆదా: విద్యుత్, ఇతర శక్తి వనరులను సమర్థవంతంగా ఉపయోగించడం.
నీటి పొదుపు: నీటి వృథాను నివారించడం, సంరక్షణ పద్ధతులు.
ప్లాస్టిక్ వినియోగ నియంత్రణ: ఒక్కసారి వాడే ప్లాస్టిక్ను తగ్గించడం.
స్థిరమైన ఆహార వ్యవస్థలు: స్థానిక, స్థిరమైన ఆహార ఎంపికలను ప్రోత్సహించడం.
వ్యర్థాల తగ్గింపు: వ్యర్థాలను తగ్గించడం, రీసైక్లింగ్ను ప్రోత్సహించడం.
ఆరోగ్యకర జీవనశైలి: పర్యావరణ అనుకూల జీవన శైలిని అలవాటు చేసుకోవడం.
ఈ–వ్యర్థ నిర్వహణ: ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహించడం.
ఈ అంశాలపై సంవత్సరం పొడవునా వివిధ కార్యక్రమాలు, వర్క్షాప్లు, పోటీల ద్వారా విద్యార్థులకు పర్యావరణ సంరక్షణ ప్రాముఖ్యతను తెలియజేయడం జరుగుతుంది.
లక్ష్మణచాంద: ఆధునిక ప్రపంచంలో అభివృద్ధి పేరి ట మానవ చర్యలతో ప్రకృతి, పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మానవ మనుగడ, జీవవైవిధ్యానికి పెను ముప్పు తప్పదని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కోసం చర్యలు చేపడుతోంది. విద్యార్థులను పాఠశాలస్థాయి నుంచే పర్యావరణ సంరక్షణలో భాగస్వాములను చేసేందుకు కేంద్ర విద్యాశాఖ అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఎకో క్లబ్లను ఏర్పాటు చేయడం, ఈ సంవత్సరం నుంచి వాటిని ‘ఎకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్’గా పునర్నామకరణం చేయడం జరిగింది.
పర్యావరణ సంరక్షణకు నూతన దిశ
పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులను చురుకై న భాగస్వాములను చేసేందుకు గతంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎకో క్లబ్లు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ సంవత్సరం నుంచి ఈ క్లబ్లను ‘ఎకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్’గా పిలవడం ద్వారా మరింత ఉత్తేజకరమైన కార్యకలాపాలను చేపట్టేందుకు కేంద్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఈ క్లబ్లను నూతనంగా ఏర్పా టు చేయాలని, ఆగస్టు 31 లోపు సంబంధిత వివరాలను విద్యాశాఖ వెబ్సైట్లో నమోదు చేయాలని ప్రధానోపాధ్యాయులకు సూచనలు ఇవ్వబడ్డాయి.
ఎకో క్లబ్ల విస్తరణ
జిల్లాలో 577 ప్రాథమిక పాఠశాలలు, 89 ప్రాథమి కోన్నత పాఠశాలలు, 164ఉన్నత పాఠశాలలు సహా మొత్తం 830 పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలల్లో ఎకో క్లబ్లు ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థుల కు పర్యావరణ అవగాహనను పెంపొందించే లక్ష్యాన్ని విద్యాశాఖ నిర్దేశించింది. ఈ ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేసేందుకు విద్యాశాఖ అధికారులు హెచ్ఎంలకు తగిన ఆదేశాలు జారీ చేశారు.
ఎకో క్లబ్ల నిర్మాణం, కార్యకలాపాలు
ప్రతీ పాఠశాలలో ఐదు ఎకో క్లబ్లను ఏర్పాటు చేయనున్నారు. ఇవి క్రింది విధంగా ఉంటాయి.
నీటి నిల్వ క్లబ్: నీటి పొదుపు, సంరక్షణపై అవగాహన.
నేల నిర్వహణ క్లబ్: నేల సంరక్షణ, స్థిరమైన వ్యవసాయ పద్ధతులపై దృష్టి.
శక్తి నిర్వహణ క్లబ్: శక్తి వనరుల సమర్థవంతమైన వినియోగం.
వ్యర్థ నిర్వహణ క్లబ్: వ్యర్థాల తగ్గింపు, రీసైక్లింగ్.
జీవవైవిధ్య క్లబ్: జీవవైవిధ్య సంరక్షణ, పరిరక్షణ.
ప్రతీ క్లబ్లో చురుకై న 10 మంది విద్యార్థులను ఎంపిక చేస్తారు. దీని ద్వారా ఒక్కో పాఠశాలలో 50 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతారు. ఈ క్లబ్లు సంవత్సరం పొడవునా వివిధ కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు పర్యావరణ సంరక్షణపై అవగాహన కల్పిస్తాయి.
చర్యలు తీసుకుంటాం
పాఠశాలస్థాయి నుంచి విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ఎకో క్లబ్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నూతనంగా ఎకో క్లబ్లను ఏర్పాటు చేయాలని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సూచించాం. ఎకో క్లబ్లను ఏర్పాటు చేసేలాగా చర్యలు తీసుకుంటాం.
– మోహన్ రావు, ఎకో క్లబ్ జిల్లా కోఆర్డినేటర్

పాఠశాలలో ఎకో క్లబ్లు