అనుక్షణం అండగా నిలిచారు.. | - | Sakshi
Sakshi News home page

అనుక్షణం అండగా నిలిచారు..

Jun 15 2025 7:17 AM | Updated on Jun 15 2025 7:17 AM

అనుక్షణం అండగా నిలిచారు..

అనుక్షణం అండగా నిలిచారు..

మాది తలమడుగు మండలంలోని గిరిజన గ్రామమైన పల్సి(బి)తండా. నాన్న జాదవ్‌ గోవింద్‌ రావు హెడ్‌ కానిస్టేబుల్‌. మా ఊరిలో తొలి ప్రభు త్వ ఉద్యోగి నాన్నే. చదువుతోనే గొప్ప భవిష్యత్తు ఉంటుందని నమ్మిన వ్యక్తి. చిన్నతనం నుంచే నాకు విద్యా ప్రాధాన్యతను వివరించారు. ఒకటి నుంచి ఐదు వరకు ఉట్నూర్‌లో, ఆరు నుంచి పదో తరగతి వరకు కాగజ్‌నగర్‌ నవోదయలో చదివాను. ఇంటర్‌ హైదరాబాద్‌లో, తిరుచ్చి ఐఐటీలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశా ను. నాన్న పోలీస్‌ శాఖలో పనిచేస్తుండటంతో జిల్లాకు వచ్చిన ఎస్పీ, కలెక్టర్ల గొప్పతనం, వారికి సమాజంలో ఉండే గౌరవం గురించి చెప్పేవారు. ఆ దిశగా లక్ష్యాన్ని ఎంచుకోవాలని సూచించేవారు. దీంతో బీటెక్‌ పూర్తికాగానే ఐఏఎస్‌ సాధించాలని నిర్ణయించుకున్నాను. తొలి నాలుగు ప్రయత్నాల్లో విఫలమయ్యాను. ఐదో ప్రయత్నంలో ఐఎఫ్‌ఎస్‌కు ఎంపికై నా అందులో చేరలేదు. 2024లో 68వ ర్యాంకు సాధించి ఐఏఎస్‌గా ఎంపికయ్యాను. ప్రస్తుతం ముస్సోరిలో శిక్షణలో ఉన్నా. పోలీస్‌ ఉద్యోగమంటే సెలవులుండేవి కావు. కానీ నేను పరీక్షలు రాసే సమయంలో నాన్న నా వెంటే ఉండేవారు. లక్ష్యాన్ని చేరుకునే దిశగా అనుక్షణం నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. ఆయన పడిన కష్టం, అందించిన మార్గదర్శనంతోనే నేను విజయం సాధించగలిగాను. – జాదవ్‌ సాయి చైతన్య, ఐఏఎస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement