
నిగ్వాలో ఖాళీ బిందెలతో నిరసన
కుభీర్: మండలంలోని నిగ్వా గ్రామంలో నీటి సమస్యను నిరసిస్తూ మహిళలు శనివారం గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. ఎండాకాలంలో గ్రామంలోని బోర్లు ఎండిపోయాయి. కొన్నింటి మోటార్లు కాలిపోయాయి. వాటికి పంచాయతీ కార్యదర్శి సిందూజ మరమ్మతులు చేయించడం లేదని తెలిపారు. సమస్య పరిష్కరించకుంటే కలెక్టర్ వద్దకు వెళ్తామని హెచ్చరించారు. నీటి సమస్యపై ఎంపీవో మోహన్సింగ్ని ప్రశ్నించగా కార్యదర్శి సిందూజను వివరణ కోరామని తెలిపారు. మరమ్మతులకు అవసరమైన డబ్బులు పంచాయతీలో లేవని తెలిపినట్లు పేర్కొన్నారు.