భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య | Wife pours petrol on husband in Krishnagiri | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం.. భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య

Jun 14 2025 1:14 PM | Updated on Jun 14 2025 1:14 PM

Wife pours petrol on husband in Krishnagiri

కర్ణాటక: భర్త వివాహేతర సంబంధాన్ని భరించలేని భార్య నిద్రిస్తున్న సమయంలో కిరోసిన్ పోసి నిప్పంటించిన ఘటనలో భర్త ఆస్పత్రిలో చనిపోయాడు. కావేరిపట్టణం వద్ద ఈ సంఘ టన జరిగింది. వివరాల మేరకు క్రిష్ణగిరి జిల్లా కావేరిపట్టణం సమీపంలోని తిమ్మాపురం ప్రాం తానికి చెందిన కూలికార్మికుడు రంగస్వామి (47), అతని భార్య కవిత(44). ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కొడుకు సూర్య (23) కొడుకు న్నాడు.

రంగస్వామి తాగుడుకు అలవాటు పడ డంతో పాటు గత మూడేళ్లుగా ధర్మపురి జిల్లా కారిమంగలం ప్రాంతానికి చెందిన ఓ మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తూ వచ్చాడు. దీం తో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయి. 9వ తేదీన రాత్రి మిద్దెపై నిద్రిస్తున్న రంగస్వా మిపై భార్య పెట్రోలు పోసి నిప్పంటించింది. తీవ్ర గాయాలేర్పడిన అతన్ని కొడుకు సూర్య చికిత్స కోసం క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకె ళ్లాడు. ఆస్పత్రిలో చికిత్స ఫలితంలేక బుధవారం రాత్రి మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement