తండ్రికొడుకు ప్రాణం తీసిన మంచం | TN man, son die as iron cot they were sleeping on collapses | Sakshi
Sakshi News home page

తండ్రికొడుకు ప్రాణం తీసిన మంచం

Nov 5 2024 11:57 AM | Updated on Nov 5 2024 12:41 PM

TN man, son die as iron cot they were sleeping on collapses

సేలం: ఇనుప మంచం పడి తండ్రి, కుమారుడు మృతి చెందిన ఘటన దిండుగల్‌ లో ఆదివారం వేకువజా మున చోటు చేసుకుంది. దిండుగల్‌ సమీపంలో ఉన్న సానర్‌పట్టి కాలియమ్మన్‌ కోవిల్‌ వీధికి చెందిన గోపీకన్నన్‌ (35) టైలర్‌గా పని చేస్తున్నాడు. ఇతని భార్య యోగేశ్వరి (32) నత్తం ప్రభుత్వాస్పత్రిలో పని చేస్తుంది. 

వీరికి కుమారుడు కార్తిక్‌ (10) ఐదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం రాత్రి యోగేశ్వరి పనికి వెళ్లడంతో ఇంట్లో గోపీకన్నన్‌ మద్యం మత్తులో ఇనుప మంచంపై పడుకుని నిద్రపోయాడు. అతని పక్కన నేలపై కార్తిక్‌ పడుకున్నాడు. ఈ స్థితిలో వేకువజామున ఇనుప మంచం బోల్టు ఊడి కింద పడింది. దీంతో మంచం మధ్యలో తల చిక్కుకుని గోపికన్నన్‌ కింద పడుకుని ఉన్న కుమారుడు కార్తిక్‌పై పడ్డాడు. దీంతో తండ్రీ, కొడుకులు మృతి చెందారు. 

సోమవారం తెల్లవారుజామున లోగేశ్వరి తన భర్త, కుమారుడిని తనిఖీ చేసేందుకు వెళ్లింది. విరిగిన ఇనుప మంచంలో తన భర్త, కొడుకు చనిపోయి పడి ఉండటాన్ని ఆమె గుర్తించింది. ఆమెతో పాటు ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. సానర్‌పట్టి పోలీసులు కేసు నమోదు చేశారు 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement