‘తేజస్‌’లో విహారం అద్భుతం

Rajnath Singh visits defence facility in Bengaluru - Sakshi

రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

సాక్షి, బెంగళూరు:  రూ.35 వేల కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారు. ఆయన శుక్రవారం కర్ణాటకలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత బెంగళూరులోని డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌లో భాగమైన ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (ఏడీఈ)ను సందర్శించారు. ఈ సందర్భంగా తేజస్‌ ఎల్‌సీఏ (లైట్‌ కంబాట్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌) విమానంలో విహరించారు.

కాక్‌పిట్‌లో కూర్చున్న ఫొటోలను తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. తేజస్‌ యుద్ధ విమానంలో విహరించడం అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. యలహంకలోని ఎయిర్‌ ఫోర్స్‌ స్టేషన్‌ 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ నేషనల్‌ కాంక్లేవ్‌ ప్రారంభోత్సవానికి రాజ్‌నాథ్‌ హాజరయ్యారు. 1971 నాటి ఇండో–పాక్‌ యుద్ధం బ్రోచర్‌ను ఆవిష్కరించి.. ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు.  బెంగళూరులో ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న 1,185 మంది పైలెట్లను రాజ్‌నాథ్‌ అభినందించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top