రైల్లో మహిళా ఐటీ ఉద్యోగినికి లైంగిక వేధింపులు | psychological harm female IT employee on a train | Sakshi
Sakshi News home page

రైల్లో మహిళా ఐటీ ఉద్యోగినికి లైంగిక వేధింపులు

Oct 9 2025 8:37 AM | Updated on Oct 9 2025 8:37 AM

psychological harm female IT employee on a train

ఆంధ్రాకు చెందిన టెక్స్‌టైల్‌ వ్యాపారి అరెస్ట్‌

సాక్షి, చెన్నై: తమిళనాడులోని ఈరోడ్‌కు చెందిన 24 ఏళ్ల మహిళ బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ ఐటీ కంపెనీలో పనిచేస్తోంది. ఆమె మంగళవారం రాత్రి బెంగళూరు నుంచి తన స్వస్థలం ఈరోడ్‌కు కుర్లా ఎక్స్‌ప్రెస్‌ రైల్లో రిజర్వ్‌ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణిస్తోంది. బుధవారం ఉదయం రైలు ధర్మపురి దాటినప్పుడు, ఓ వ్యక్తి ఆ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. షాక్‌కు గురైన మహిళ కేకలు వేయగా, తన తోటి ప్రయాణికుల సాయంతో ఆ వ్యక్తిని ఆమె పట్టుకుంది. తర్వాత రైలు బుధవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో సేలం రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న రైల్వే పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. అతను ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరుకు చెందిన శంకర్‌(45)గా గుర్తించారు. వస్త్ర వ్యాపారం కోసం ఈరోడ్‌కు వచ్చినట్లు తేలింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement