ఒడిశా సీఎంగా సురేశ్‌ పూజారి? | Odisha: Suresh Pujari Called To Delhi | Sakshi
Sakshi News home page

ఒడిశా సీఎంగా సురేశ్‌ పూజారి?

Jun 10 2024 5:28 AM | Updated on Jun 10 2024 5:28 AM

Odisha: Suresh Pujari Called To Delhi

ఢిల్లీకి రావాలంటూ అధిష్టానం పిలుపు

భువనేశ్వర్‌: ఒడిశా అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో దాదాపు 24 ఏళ్లకు బీజేపీ గెలుపు సొంతం చేసుకోవడం తెల్సిందే. ముఖ్యమంత్రి కుర్చీని అధిరోహించేదెవరన్న విషయంలో మాత్రం సందిగ్ధం కొనసాగుతోంది. అయితే, సీనియర్‌ నేత, తాజాగా ఎమ్మెల్యే సురేశ్‌ పూజారిని పార్టీ హైకమాండ్‌ ఢిల్లీకి రావాలంటూ కబురు పంపించింది.

 దీంతో, సీఎం పదవి ఆయనకే దక్కవచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. శాసనసభా పక్ష నేత ఎవరనేది అధిష్టానమే చూసుకుంటుందని రాష్ట్ర వర్గాలు అంటున్నాయి. ఇలా ఉండగా, ప్రధానమంత్రి బిజీ షెడ్యూల్‌ దృష్ట్యా కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని ఈ నెల 10కి బదులుగా 12న చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు వివరించాయి.

Advertisement
 
Advertisement
Advertisement