NPS: పెన్షనర్లకు కేంద్రం శుభవార్త!

NPS withdrawal eased but facility available for limited period - Sakshi

మోదీ ప్రభుత్వం పెన్షనర్లకు భారీ ఊరట కలిగించింది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ(పీఎఫ్ఆర్‌డీఏ) తాజాగా నేషనల్ పెన్షన్ వ్యవస్థ(ఎన్‌పీఎస్) విత్‌డ్రాయెల్ నిబంధనలను సడలించింది. కోవిడ్ -19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని, చందాదారుల ఎగ్జిట్ లేదా విత్‌డ్రాయెల్ డాక్యుమెంట్ల సెల్ఫ్ అటెస్డెడ్ కాపీలను డిజిటల్ రూపంలో స్వీకరించడానికి పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్(పీఒపీ)ను అనుమతించింది. 2021 జూన్ 30 వరకు ఎన్‌పీఎస్ విత్‌డ్రాయెల్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఒటీపీ/ఈ-సైన్ ఆధారంగా 'ఆన్‌లైన్ పేపర్‌లెస్ ఎగ్జిట్ ప్రాసెస్' ఎన్‌పీఎస్ చందాదారుల కోసం సీఆర్‌ఎ తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. 

దీనికి సంబంధించి పీఎఫ్ఆర్‌డీఏ ఒక సర్క్యూలర్ కూడా జారీ చేసింది. ఎన్‌పీఎస్ విత్‌డ్రాయెల్స్‌కు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను సబ్‌స్క్రైబర్లు డిజిటల్ రూపంలో సీఆర్ఏకు పంపొచ్చు. కోవిడ్ 19 సమయంలో ఎన్‌పీఎస్ విత్‌డ్రాయెల్‌కు సంబంధించి స్వయంగా డాక్యుమెంట్లు అందించడానికి పెన్షనర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని పీఎఫ్ఆర్‌డీఏ తెలిపింది. జూలై 21, 2020 నాటి సర్క్యులర్‌లో పేర్కొన్న సర్క్యులర్‌ ప్రకారం చందాదారుల ఎగ్జిట్ లేదా విత్‌డ్రాయెల్ కేసులకు సంబంధించి అనేక సందర్భాల్లో పిఆర్‌పిలు సిఆర్‌ఎకు రికార్డులు పంపించలేదని పిఎఫ్‌ఆర్‌డిఎ పేర్కొంది. కేసులు, కఠినమైన లేదా మృదువైన కాపీలు, రికార్డ్ కీపింగ్ మరియు కంట్రోల్ ప్రయోజనం కోసం విఫలం కాకుండా 2021 జూన్ 30 లోగా సంబంధిత CRA తో POP లు పంచుకోవలసి ఉంటుంది.

చదవండి: వాట్సప్‌ సమస్యలపై గ్రీవెన్స్ ఆఫీసర్‌కి కంప్లైంట్ చేయడం ఎలా?

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top