Husband Critical And Married Woman Killed In Road Accident In Bengaluru - Sakshi
Sakshi News home page

కొత్త కాపురంలో విషాదం.. భార్య మృతి, భర్త పరిస్థితి విషమం

Aug 22 2022 2:47 PM | Updated on Aug 22 2022 3:20 PM

Newly Married Karnataka Woman Killed in Road Accident - Sakshi

ఆనంద్‌, శ్వేత (ఫైల్‌)

బెంగళూరు: కొత్త దంపతులు సినిమా చూసి ద్విచక్ర వాహనంలో వస్తుండగా వెనుక నుంచి వేగంగా లారీ ఢీకొనడంతో భార్య ఘటన స్థలంలోనే మృతి చెందగా భర్త తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన నగరంలోని బాణసవాడి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం అర్దరాత్రి చోటుచేసుంది. బాణసవాడికి చెందిన శ్వేత (23) ఆనంద్‌ (28) దంపతులకు ఇటీవల వివాహం జరిగింది.

కొత్త దంపతులు శనివారం రాత్రి సినిమా చూసి ఆనందంగా ఇంటికి బయలుదేరారు. కల్యాణనగర జంక్షన్‌ వద్ద లారీ స్కూటర్‌ను వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఘటన స్థలంలోనే శ్వేత మృతి చెందగా ఆనంద్‌ను ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.   

చదవండి: (నగల వ్యాపారికి హనీ ట్రాప్‌.. వద్దన్నా హోటల్‌కు.. యువతి ఎంట్రీ..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement