లోయలో పడిన బస్సు.. ఒకరు మృతి, 56 మందికి గాయాలు

jammu And Kashmir: One dead, 56 Injured In Bus Accident at Nowshera - Sakshi

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజౌరి జిల్లా నుంచి నౌషేరా ప్రాంతానికి ప్రయాణిస్తున్న బస్సు.. లామ్‌ ప్రాంతంలో అదుపుతప్పి లోయలో పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 56 మందికి గాయాలైనట్లు నౌషేరా పోలీసు అధికారి సుఖ్‌దేవ్‌ సింగ్‌ తెలిపారు. క్షతగాతత్రులను ఆసుపతత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఒకరు మృతిచెందినట్లు తెలిపారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
చదవండి: యూపీ అసెంబ్లీలో అరుదైన దృశ్యం.. ఒకరికొకరు ఎదురుపడిన యోగి, అఖిలేష్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top