తండ్రి సాహసం: బిడ్డకు ప్రేమతో 300 కి.మీ సైకిల్‌పై.. | Father Travel 300 Km On Cycle For Son Medicine | Sakshi
Sakshi News home page

కొడుకు మందుల కోసం 300 కి.మీ.సైకిల్‌ తొక్కిన తండ్రి

Jun 1 2021 8:35 AM | Updated on Jun 1 2021 8:35 AM

Father Travel 300 Km On Cycle For Son Medicine - Sakshi

కుమారుడి మందుల కోసం సైకిల్‌పై వెళ్తున్న తండ్రి ఆనంద్‌

మైసూరు: కుమారునికి అనారోగ్యంగా ఉండడంతో కావలసిన మందుల కోసం ఓ తండ్రి సైకిల్‌పై సుమారు 300 కిలోమీటర్ల దూరంలోని బెంగళూరుకు వెళ్లి మందులు తీసుకొచ్చాడు. తండ్రి ప్రేమను చాటే ఈ సంఘటన మైసూరు జిల్లా టి.నరిసిపురలో చోటు చేసుకుంది. ఆనంద్‌ (45) తన పదేళ్ల కొడుకును కాపాడుకోవడం కోసం బెంగళూరులోని నిమ్హాన్స్‌కు సైకిల్‌పై వెళ్లి మందులు తీసుకొని తిరిగి వచ్చాడు. కుమారుడు దివ్యాంగుడు కావడంతో పాటు ఇటీవల జబ్బు పడ్డాడు. డాక్టర్లు రాసిన మందులు మైసూరులో దొరకలేదు. లాక్‌డౌన్‌ కావడంతో బెంగళూరుకు వెళ్లడానికి ఎటువంటి రవాణా వసతులు లేవు. దీంతో సైకిల్‌నే ఆశ్రయించాడు.

Advertisement
 
Advertisement
Advertisement