ఫుడ్‌కోర్టులో ‘గుడ్డు’ వివాదం | Egg Selling Issue In Vegetable Hotel Karnataka | Sakshi
Sakshi News home page

ఫుడ్‌కోర్టులో ‘గుడ్డు’ వివాదం

Aug 21 2022 3:09 PM | Updated on Aug 21 2022 3:24 PM

Egg Selling Issue In Vegetable Hotel Karnataka - Sakshi

శివమొగ్గ(బెంగళూరు): శివమొగ్గ నగర పార్కు లేఔట్‌ ప్రధాన రోడ్డులో వెజ్‌ ఫుడ్‌ కోర్టు (శాఖాహార)లో గుడ్లకు సంబంధించిన ఆహార విక్రయంపై గొడవ జరిగింది. వ్యాపారస్తులు బాహాబాహీకి కూడా దిగాల్సి వచ్చింది. శనివారం వెజ్‌ఫుడ్‌ కోర్టులో గుడ్డుతో తయారు చేసిన ఆహారాన్ని విక్రయించారు.

దీనికి కొందరు మరికొందరు ఆక్షేపణ వ్యక్తం చేశారు. వెజ్‌ఫుడ్‌ కోర్టులో గుడ్డుతో తయారు చేసిన ఆహారాన్ని విక్రయించేందుకు అవకాశం లేదని గొడవకు దిగారు. ఇదే విషయంపై శివమొగ్గ మహానగర పాలికెకు కొందరు ఫిర్యాదు చేశారు. 

చదవండి: మొబైల్‌ చార్జర్‌ మాదిరిగా ఉండే స్పై కెమెరాను అమర్చి..

Advertisement
 
Advertisement
Advertisement