మా వాదనలూ వినండి  | ED filed caveat in Supreme Court on MLC Kavitha's petition | Sakshi
Sakshi News home page

మా వాదనలూ వినండి 

Mar 19 2023 2:09 AM | Updated on Mar 19 2023 2:09 AM

ED filed caveat in Supreme Court on MLC Kavitha's petition - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్‌లో తమ వాదనలు వినాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు శనివారం ఈడీ కేవియట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.

ఈ కేసులో తనపై ఈడీ తీవ్ర చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని ఇటీవల కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కవిత చేసిన అభ్యర్థనను సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనం తోసిపుచ్చింది. సుప్రీంకోర్టు ఈ కేసును ఈనెల 24న విచారించనుంది. మరోవైపు 20న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్సీ కవితకు ఈడీ ఇప్పటికే సమన్లు జారీ చేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement