రెండేళ్ల తర్వాత కనిపించిన దలైలామా  | Dalai Lama Makes First Public Appearance In Two Years | Sakshi
Sakshi News home page

రెండేళ్ల తర్వాత కనిపించిన దలైలామా 

Mar 19 2022 7:58 AM | Updated on Mar 19 2022 8:08 AM

Dalai Lama Makes First Public Appearance In Two Years - Sakshi

ధర్మశాల: దేశంలో కోవిడ్‌ మహమ్మారి  ప్రబలిన దాదాపు రెండేళ్ల తర్వాత బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా శుక్రవారం బయటకు వచ్చారు. ధర్మశాలలో ఉన్న బౌద్ధ సన్యాసులు, ఇతర సభ్యులకు జాతక కథలను ఆయన బోధించారు.

అనంతరం, టిబెటన్‌ బౌద్ధుల ప్రధాన ఆలయం వద్ద బోధిచిత్త వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా దలైలామా మాట్లాడుతూ..‘శుక్రవారం ఢిల్లీ వెళ్లి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంది. అయితే, నా ఆరోగ్యం చాలా బాగుండటంతో వెళ్లడం మానేశాను. మా డాక్టర్‌తో కూడా ఇప్పుడు బాక్సింగ్‌ ఆడుకుంటున్నాను’ అంటూ ఆయన చమత్కరించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement