భారత్‌: 46 లక్షలు దాటిన కరోనా కేసులు

Coronavirus Cases Crosses 46 Lakhs Mark In India - Sakshi

న్యూఢిల్లీ :  భారత్‌లో గడిచిన 24 గంటల్లో 97,570 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 46,59,984కు చేరింది. నిన్న ఒక్కరోజే 1201 మంది మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 77,472 కు చేరుకుంది. ఈ మేరకు  కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో దేశంలో కరోనా నుంచి కోలుకుని 81,533 డిశ్చార్జ్‌ అవ్వగా.. ఇప్పటివరకు మొత్తం 36,24,196 కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 9,58,316గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 20.56 శాతం ఉన్నాయి. మరణాల రేటు 1.66 శాతానికి తగ్గింది. 

చదవండి : తెలంగాణలో ఒక్కరోజే 2278 కేసులు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top