కరోనా ఉధృతి: భారత్‌లో 1.68 లక్షలు దాటిన కొత్త కేసులు

Corona Virus: Covid And Omicron Cases Updates In India - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గడిచిన 24 గంటలలో 1,68,063 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటలలో 69,959 మంది వైరస్‌ బారి నుంచి కొలుకున్నారు. అదే విధంగా,  మహమ్మారి బారిన పడి 277 మంది మృత్యువాతపడ్డారు.

ప్రస్తుతం 8,21,446 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్‌ను ప్రకటించింది. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 10.64 శాతంగా ఉంది. మరోవైపు ఒమిక్రాన్‌ కేసులు కూడా శరవేగంగా పెరుగుతున్నాయి. దేశంలో గత 24 గంటలలో 4,461 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top