బిహార్‌లో తెలంగాణకు చెందిన ఆర్మీ జవాన్‌ ఆత్మహత్య!

Army Jawan From Telangana Shoots Himself Dead In Bihar  - Sakshi

పాట్నా: భారత సాయుధ బలగాల్లో ఒకటైన సశస్త్ర సీమా బల్‌(ఎస్‌ఎస్‌బీ)కు చెందిన ఓ జవాన్‌ తన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. బిహార్‌, సుపాల్‌ జిల్లాలోని వీర్‌పుర్‌లో శుక్రవారం ఉదయం ఈ సంఘటన జరిగింది. ఆత్మహత్యకు పాల్పడింది ఎస్‌ఎస్‌బీ 45వ బెటాలియన్‌కు చెందిన జవాన్‌ చిమాల్‌ విష్ణుగా గుర్తించారు. ఆయన తెలంగాణకు చెందిన వారిగా అధికారులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు. 

ఇదీ చదవండి: బిహార్‌లో నకిలీ పోలీస్‌ స్టేషన్‌.. 8 నెలలుగా వసూళ్ల పర్వం

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top