క్షయరోగుల్లో యువతే అత్యధికం! | 65 per cent of tuberculosis cases in 15-45 age group | Sakshi
Sakshi News home page

క్షయరోగుల్లో యువతే అత్యధికం!

Aug 10 2021 3:45 AM | Updated on Aug 10 2021 3:45 AM

65 per cent of tuberculosis cases in 15-45 age group - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో క్షయ రోగం బారిన పడుతున్నవారిలో అత్యధికులు 15–45ఏళ్లలోపువారేనని ఆరోగ్య మంత్రి  మాండవీయ చెప్పారు. దేశంలో నమోదవుతున్న టీబీ కేసుల్లో 65 శాతం ఈ వయసు గ్రూపులోనివారేనని తెలిపారు. టీబీ కేసుల్లో 58 శాతం గ్రామీణ ప్రాంతాల్లో నమోదవుతున్నాయని, దీనివల్ల పలు కుటుంబాలు కుంగుబాటుకు గురవుతున్నాయని తెలిపారు. టీబీపై ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి సంబంధించిన వివరాలను ఆయన పార్లమెంట్‌ సభ్యులకు వివరించారు. ప్రతి ఎంపీ ఈ విషయంపై తమ నియోజకవర్గ ప్రజలకు అవగాహన కలి్పంచాలని కోరారు. 15–45 సంవత్సరాల మధ్య వయసు్కలంటే ఉత్పాదకత అధికంగా ఉండే వయసని, సరిగ్గా ఈ వయసులో టీబీ బారిన పడడం అటు వారికి, ఇటు దేశానికి నష్టదాయకమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్‌ వేళ టీబీని అడ్డుకోవడం కష్టసాధ్యంగా మారుతోందని ఆరోగ్యశాఖ సహాయ మంత్రి భారతి పవార్‌ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement