సభలో మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ తీరు సిగ్గు చేటు: ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి | MLC Varudu Kalyani criticizes Health Minister Satya Kumar Yadav over diarrhea-related deaths | Sakshi
Sakshi News home page

సభలో మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ తీరు సిగ్గు చేటు: ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి

Nov 13 2024 2:30 PM | Updated on Nov 13 2024 3:42 PM

MLC Varudu Kalyani criticizes Health Minister Satya Kumar Yadav over diarrhea-related deaths

సాక్షి,అమరావతి : ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌పై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. శాసన మండలి చర్చలో ‘డయేరియాపై సభ్యుల ఆవేదన చూసి ముచ్చట వేస్తోంది. 15ఏళ్లలో ఎప్పుడు లేని మరణాలు సంభవించాయి’అని చిరునవ్వుతో మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ వెకిలిగా మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు.

శాసన మండలి సమావేశాల సందర్భంగా డయేరియా మరణాలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మీడియాతో మాట్లాడారు. 

‘‘సభలో డయేరియాపై ఆరోగ్యశాఖ మంత్రి సమాధానం బాధాకరం. మృతులపై ఎంతటి అభిమానం ఉందో మంత్రి నిర్లక్ష్య సమాధానమే చెబుతోంది.మంత్రి సత్యకుమార్ యాదవ్ వెకిలిగా మాట్లాడటం సిగ్గుచేటు. ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందింది. గత 30 ఏళ్లలో గుర్లలో ఎన్నడూ డయేరియా మరణాలు సంభవించలేదు. సెప్టెంబర్ 20న మొదటి కేసు నమోదైంది. అక్టోబర్ 12వ తేదీ నాటికి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. అక్టోబర్ 19న వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్‌ చేసే వరకు ప్రభుత్వంలో చలనం రాలేదు.

చదవండి: డయేరియా మరణాలపై నవ్వుతూ హేళనగా మాట్లాడిన ఏపీ మంత్రి 

20 కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వాసుపత్రి ఉంది. పక్క జిల్లాలో కేజీహెచ్ ఉంది. కానీ స్కూల్‌ బల్లలపై వైద్యం అందించారు. స్కూల్ బల్లలపై డయేరియా బాధితులకు వైద్యం అందించినందుకు ప్రభుత్వం సిగ్గు పడాలి. మృతుల సంఖ్యను తగ్గించడం పైనే ప్రభుత్వం దృష్టి పెట్టింది. డయేరియా నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే ఆలోచన కూడా చేయలేదు. ఒక్కో డయేరియా బాధిత కుటుంబానికి  వైఎస్‌ జగన్‌ రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.  

ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. వైఎస్‌ జగన్‌  వెళ్లే వరకూ జిల్లా ఇంఛార్జి మంత్రి వంగలపూడి అనిత..ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌ కూడా వెళ్లలేదు. మృతులకు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం’’ అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

కూటమి ప్రభుత్వంపై YSRCP ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఫైర్

Advertisement
 
Advertisement
Advertisement