కొత్త విద్యా సంవత్సరం సోమ వారం నుంచి ప్రారంభమవుతుంది. విద్యాశాఖ క్యాలెండర్ ప్రకారం బోధన జరుగుతుంది. గతంలో వివిధ పాఠశాలల్లో ప్రారంభమైన పనులు పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకున్నాం. మౌలిక సౌకర్యాలైన తాగునీరు కల్పించి టాయిలెట్స్ వినియోగంలోకి తెస్తాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఖాళీల స్థానంలో తగిన చర్యలు తీసుకుంటాం. పాఠ్య, రాత పుస్తకాలు మొదటిరోజే అందిస్తాం. యూనిఫామ్స్ ఆలస్యం కానుంది. నాలుగు మండలాల్లో అల్పాహారం ప్రారంభం కానుంది.
– గోవిందరాజు, జిల్లా విద్యాధికారి


