మల్లన్న సేవలో బ్రిగేడ్‌ కమాండర్‌ | - | Sakshi
Sakshi News home page

మల్లన్న సేవలో బ్రిగేడ్‌ కమాండర్‌

Jun 17 2026 5:15 AM | Updated on Jun 17 2026 5:15 AM

శ్రీశైలం టెంపుల్‌: శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్లను సేనా మెడల్‌ గ్రహీత బ్రిగేడ్‌ కమాండర్‌ రాహుల్‌ మచ్హరాల్‌ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం మల్లన్న దర్శనార్థం విచ్చేసిన కమాండెంట్‌ దంపతులకు ఆలయ రాజగోపురం వద్ద ఈఓ ఎం.శ్రీనివాసరావు అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం కమాండెంట్‌ దంపతులు మల్లికార్జున స్వామి వారికి రుద్రాభిషేకం, భ్రమరాంబా దేవికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆలయం వద్ద గల ఆశీర్వచన మండపంలో కమాండెంట్‌ దంపతులకు వేదపండితులు వేదమంత్రాలు పలుకగా, అర్చకులు ఆశీర్వచనాలు అందించారు. దేవస్థాన ఈఓ స్వామి వారి జ్ఞాపికను అందించి సత్కరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement