ఎక్కడా అటంకం కలగడం లేదు..
పదో తరగతి వార్షిక పరీక్షలో గతేడాది కంటే ఇప్పుడు ఉత్తమ ఫలితా లు సాధించేలా ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నాం. విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. వరుస ఎన్నికల నేపథ్యంలో బోధనలో కొన్ని ఇబ్బందులు కలిగిన విషయం వాస్తవమే. అయినా అన్నింటిని సరిచేసుకుంటూ.. ముందుకు సాగుతున్నాం. గతం కంటే రాష్ట్రస్థాయిలో ఉత్తమ ర్యాంక్ సాధిస్తాం. వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థులను సిద్ధం చేశాం. – రమేష్కుమార్ జిల్లా విద్యాధికారి
ఆందోళనకు గురికావద్దు..
పరీక్షలు దగ్గర పడుతున్నాయని ఎక్కువ గంటలు చదువుతూ విద్యార్థులు ఆహారం, నిద్రను నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇది మెదడుపై ప్రభావం చూపుతోంది. గంట చదివితే 15 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. పరీక్షల సమయంలో ఆహారాన్ని మితంగా తీసుకొని పండ్ల జ్యూస్లకు ప్రాధాన్యత ఇవ్వాలి.
– రాజేష్గౌడ్, పీడియాట్రిక్, ప్రభుత్వ మెడికల్ కళాశాల, నాగర్కర్నూల్
●
ఎక్కడా అటంకం కలగడం లేదు..


